News April 12, 2024
మహిళా బిలియనీర్కు మరణశిక్ష

వియత్నాంలో ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు మోసం బయటపడింది. దోషిగా తేలిన బిలియనీర్ ట్రూంగ్ మై లాన్కు మరణశిక్ష పడింది. వ్యాపారవేత్త, ప్రాపర్టీ డెవలపర్ అయిన ట్రూంగ్ గత 11ఏళ్లుగా వియత్నాంలోని సైగాన్ కమర్షియల్ బ్యాంకును మోసం చేసి 44 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.3.68 లక్షల కోట్లు రుణం తీసుకొని ఎగ్గొట్టారు. తాజాగా హో చి మిన్ సిటీలోని కలోనియల్ ఎరా కోర్ట్హౌస్ ఆమెకు మరణశిక్ష విధించింది.
Similar News
News February 4, 2026
ఆన్లైన్ గేమ్ పిచ్చి: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు ఘజియాబాద్(UP)లో వారు నివసిస్తున్న బిల్డింగ్ 9వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. బుధవారం వేకువజామున 2గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. కరోనా నుంచి వీరు ఒక కొరియన్ టాస్క్ బేస్డ్ గేమ్కు అడిక్ట్ అయ్యారు. చదువు మానేసి మరీ గేమ్స్ ఆడుతుండటంతో పేరెంట్స్ మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ముగ్గురూ ఒకేసారి బిల్డింగ్ పైనుంచి దూకేశారు.
News February 4, 2026
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో సీనియర్ ఇంజినీర్ పోస్టులు

<
News February 4, 2026
ఆ సమయంలో విరాట్ నాకు అండగా నిలిచాడు: ఇషాన్

2021లో ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న తనకు విరాట్ కోహ్లీ అందించిన ప్రోత్సాహాన్ని ఇషాన్ కిషన్ గుర్తుచేసుకున్నారు. మానసికంగా కుంగిపోయినప్పుడు తనను కోహ్లి ఓదార్చారని, ఆ విషయాన్ని ఎప్పుడూ మరవనని ఓ పాడ్కాస్ట్లో చెప్పుకొచ్చారు. అయితే 2022లో ఇషాన్ వన్డేల్లో ఫాస్టెస్ట్ 200 చేసినప్పుడు నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కోహ్లీ ఇషాన్ను అభినందించారు. విరాట్ సాక్షిగా రికార్డు నెలకొల్పడం విశేషమని ఇషాన్ అన్నారు.


