News April 12, 2024
మహిళా బిలియనీర్కు మరణశిక్ష

వియత్నాంలో ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు మోసం బయటపడింది. దోషిగా తేలిన బిలియనీర్ ట్రూంగ్ మై లాన్కు మరణశిక్ష పడింది. వ్యాపారవేత్త, ప్రాపర్టీ డెవలపర్ అయిన ట్రూంగ్ గత 11ఏళ్లుగా వియత్నాంలోని సైగాన్ కమర్షియల్ బ్యాంకును మోసం చేసి 44 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.3.68 లక్షల కోట్లు రుణం తీసుకొని ఎగ్గొట్టారు. తాజాగా హో చి మిన్ సిటీలోని కలోనియల్ ఎరా కోర్ట్హౌస్ ఆమెకు మరణశిక్ష విధించింది.
Similar News
News November 11, 2025
థైరాయిడ్ వల్ల జుట్టు ఊడుతోందా?

కొంతమందిలో థైరాయిడ్ కంట్రోల్లో ఉన్నప్పటికీ హెయిర్ఫాల్ అవుతుంటుంది. దీనికి విటమిన్ డి, కాల్షియం లోపం కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి చేపలు, గుడ్లు, పాల సంబంధిత ఉత్పత్తులు, నువ్వులు, డేట్స్, నట్స్ వంటి కాల్షియం రిచ్ ఫుడ్స్, డి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు డైట్లో చేర్చుకోవాలని ఎండోక్రినాలజిస్టులు సూచిస్తున్నారు. ✍️ మరింత ఉమెన్, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 11, 2025
ఆత్మాహుతి దాడి వెనుక జైష్-ఇ-మహమ్మద్!

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడేనని కేసు దర్యాప్తు చేస్తున్న ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. దీని వెనుక జైష్-ఇ-మహమ్మద్ ఉన్నట్లు తెలిపాయి. దేశ రాజధాని నడిబొడ్డున కూడా దాడిచేసే సామర్థ్యం తమకు ఉందని చెప్పేందుకే ఎర్రకోటను ఎంచుకున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఈ కేసు విచారణను కేంద్రం ఎన్ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే.
News November 11, 2025
గట్లు చెక్కే యంత్రంతో కలిగే లాభాలు

సాధారణంగా ఇద్దరు మనుషులు రోజంతా కష్టపడితే ఎకరం పొలంలో గట్టు చెక్కగలరు. ఈ యంత్రం సహాయంతో ఒక రోజులో 15 నుంచి 25 ఎకరాల వరకు గట్లు చెక్కవచ్చు. ఈ యంత్రం సాయంతో గంటకు 3-4 ఎకరాల్లో.. దాదాపు 18 ఇంచుల వరకూ గట్లు చెక్కవచ్చంటున్నారు నిపుణులు. ఈ మెషిన్ భాగాలు స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయడం వల్ల బురదలో నడిచినా తుప్పు పట్టవు. అతి ముఖ్యంగా కూలీల కొరత సమస్యకు ఈ యంత్రం చెక్ పెడుతుంది.


