News April 12, 2024
మహిళా బిలియనీర్కు మరణశిక్ష

వియత్నాంలో ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు మోసం బయటపడింది. దోషిగా తేలిన బిలియనీర్ ట్రూంగ్ మై లాన్కు మరణశిక్ష పడింది. వ్యాపారవేత్త, ప్రాపర్టీ డెవలపర్ అయిన ట్రూంగ్ గత 11ఏళ్లుగా వియత్నాంలోని సైగాన్ కమర్షియల్ బ్యాంకును మోసం చేసి 44 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.3.68 లక్షల కోట్లు రుణం తీసుకొని ఎగ్గొట్టారు. తాజాగా హో చి మిన్ సిటీలోని కలోనియల్ ఎరా కోర్ట్హౌస్ ఆమెకు మరణశిక్ష విధించింది.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


