News April 12, 2024

మహిళా బిలియనీర్‌కు మరణశిక్ష

image

వియత్నాంలో ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు మోసం బయటపడింది. దోషిగా తేలిన బిలియనీర్‌ ట్రూంగ్ మై లాన్‌‌కు మరణశిక్ష పడింది. వ్యాపారవేత్త, ప్రాపర్టీ డెవలపర్‌ అయిన ట్రూంగ్ గత 11ఏళ్లుగా వియత్నాంలోని సైగాన్ కమర్షియల్ బ్యాంకును మోసం చేసి 44 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.3.68 లక్షల కోట్లు రుణం తీసుకొని ఎగ్గొట్టారు. తాజాగా హో చి మిన్ సిటీలోని కలోనియల్ ఎరా కోర్ట్‌హౌస్ ఆమెకు మరణశిక్ష విధించింది.

Similar News

News November 14, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 4

image

18. నిద్రలో కూడా కన్ను మూయనిది?(జ.చేప)
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?(జ.అస్త్రవిద్యచేత)
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?(జ.యజ్ఞం చేయుట వలన)
21. జన్మించినా ప్రాణం లేనిది?(జ.గుడ్డు)
22. రూపం ఉన్నా హృదయం లేనిది?(జ.రాయి)
23. మనిషికి దుర్జనత్వం ఎలా వస్తుంది?(జ.శరణుకోరిన వారిని రక్షించకపోతే)<<-se>>#YakshaPrashnalu<<>>

News November 14, 2025

IND vs SA టెస్ట్.. తొలిరోజు స్కోర్ ఎంతంటే?

image

ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌత్ ఆఫ్రికాపై తొలి టెస్టులో భారత్ చెలరేగింది. తొలుత బ్యాటింగ్ చేసిన SAను 159కే ఆలౌట్ చేసింది. మార్క్రమ్(31), ముల్డర్(24), టోనీ(24), రికెల్టన్(23) ఫర్వాలేదనిపించారు. బుమ్రా 5, సిరాజ్, కుల్దీప్ చెరో 2, అక్షర్ 1 వికెట్ తీశారు. బ్యాటింగ్‌లో జైస్వాల్(12) అవుటవ్వగా.. KL రాహుల్(13*), సుందర్(6*) క్రీజులో ఉన్నారు. తొలిరోజు ఆటముగిసే సరికి IND ఒక వికెట్ నష్టానికి 37 రన్స్ చేసింది.

News November 14, 2025

జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు: రేవంత్

image

TG: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలుపు తమ బాధ్యతను పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 51 శాతం ప్రజలు జూబ్లీహిల్స్ లో తమకు ఓటు వేశారని చెప్పారు. ‘గత అసెంబ్లీ ఎన్నికల్లో మాకు హైదరాబాద్‌లో సానుకూల ఫలితాలు రాలేదు. ప్రజలు మా తీరును గమనించి తీర్పును ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయి’ అని ధీమా వ్యక్తం చేశారు.