News April 12, 2024
మహిళా బిలియనీర్కు మరణశిక్ష

వియత్నాంలో ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు మోసం బయటపడింది. దోషిగా తేలిన బిలియనీర్ ట్రూంగ్ మై లాన్కు మరణశిక్ష పడింది. వ్యాపారవేత్త, ప్రాపర్టీ డెవలపర్ అయిన ట్రూంగ్ గత 11ఏళ్లుగా వియత్నాంలోని సైగాన్ కమర్షియల్ బ్యాంకును మోసం చేసి 44 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.3.68 లక్షల కోట్లు రుణం తీసుకొని ఎగ్గొట్టారు. తాజాగా హో చి మిన్ సిటీలోని కలోనియల్ ఎరా కోర్ట్హౌస్ ఆమెకు మరణశిక్ష విధించింది.
Similar News
News March 24, 2025
TTDలో హిందూయేతర ఉద్యోగుల తొలగింపు: BR

AP: 2025-26కు గాను ₹5,258Crతో TTD వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపినట్లు ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. TTDలో పనిచేసే హిందూయేతర ఉద్యోగుల తొలగింపుపై తీర్మానం చేసినట్లు తెలిపారు. జూపార్క్ నుంచి కపిల తీర్థం వరకు ప్రైవేట్ కట్టడాలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకోసారి సుపథం దర్శనం కల్పిస్తామని, వృద్ధులు, వికలాంగులకు ఆఫ్లైన్లో దర్శన టికెట్లు ఇస్తామని పేర్కొన్నారు.
News March 24, 2025
క్యాన్సర్ కేసులపై ప్రచారంలో నిజం లేదు: మంత్రి

AP: రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. అనపర్తి నియోజకవర్గంలో 105 మందికి క్యాన్సర్ సోకినట్లు తేలిందని చెప్పారు. బ్రెస్ట్, సర్వైకల్, బ్లడ్, ఓరల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. అనపర్తిని యూనిట్గా తీసుకొని ఇప్పటివరకు 1.19 లక్షల మందికి స్క్రీనింగ్ చేశామన్నారు.
News March 24, 2025
SHOCK: 40% స్టూడెంట్ వీసాల్ని రిజెక్ట్ చేసిన US

అమెరికాలో చదవాలనుకుంటున్న విద్యార్థులకు షాక్. US అడ్మినిస్ట్రేషన్ రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలను తిరస్కరిస్తోంది. తాజాగా ఈ రిజెక్షన్ రేటు 40%కి చేరడం గమనార్హం. FY2023-24లో 6.79 లక్షల దరఖాస్తులు రాగా అందులో 2.79 లక్షల వీసాలను తిరస్కరించినట్టు తెలిసింది. US జారీ చేసే స్టూడెంట్ వీసాల్లో 90% వరకు F1 ఉంటాయి. 2023లో లక్ష మందికి F1 వీసాలు రాగా 2024 JAN – SEP కాలంలో ఇవి 64,008కి తగ్గిపోయాయి.