News September 27, 2024
Festive Season: 6000 స్పెషల్ ట్రైన్స్, 12500 కోచులు

ఇండియన్ రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. పండుగల సీజన్లో 6వేల స్పెషల్ ట్రైన్స్ నడిపిస్తామని తెలిపింది. ఇవి కోటి మందికి పైగా ప్యాసింజర్లను ఇళ్లకు చేరుస్తాయని వెల్లడించింది. దసరా, దీపావళి, ఛాత్ను జరుపుకొనేందుకు ప్రజలు సొంత రాష్ట్రాలకు వెళ్లే సంగతి తెలిసిందే. ఇవే కాకుండా 108 రైళ్లకు అదనపు జనరల్ కోచులు జత చేస్తామని, రద్దీకి తగినట్టుగా 12,500 కోచ్ల్ని మంజూరు చేశామని రైల్వే మినిస్టర్ వైష్ణవ్ తెలిపారు.
Similar News
News December 8, 2025
‘వారణాసి’కి మహేశ్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

రాజమౌళి ‘వారణాసి’ చిత్రం కోసం మహేశ్ బాబు ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నారని సినీ వర్గాలు తెలిపాయి. మూవీ పూర్తయ్యేందుకు 3-4 ఏళ్లు పట్టే అవకాశం ఉండటంతో మొత్తం రూ.150-200 కోట్లు తీసుకుంటారని సమాచారం. సాధారణంగా మహేశ్ ఒక్క సినిమాకు రూ.70 కోట్లు తీసుకుంటారని టాక్. కాగా ‘వారణాసి’ 2027 మార్చిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
News December 8, 2025
రూర్బన్ పంచాయతీలుగా 359 గ్రామాలు

AP: 10వేల జనాభా, కోటికి పైగా ఆదాయమున్న359 గ్రామాలను రూర్బన్ పంచాయతీలుగా ప్రభుత్వం మార్చనుంది. CM CBN సూచనలతో వీటిని ఏర్పాటు చేస్తోంది. పట్టణ తరహా సదుపాయాలను వీటిలో కల్పించనుంది. నిబద్ధత కలిగిన Dy MPDOలను వీటికి కార్యదర్శులుగా నియమిస్తారు. ప్రతి 4 జిల్లాలకు కలిపి ZP CEO స్థాయిలో పర్యవేక్షణాధికారిని ఏర్పాటు చేస్తారు. MNPల మాదిరి వివిధ కార్యక్రమాలకోసం నాలుగు విభాగాల సిబ్బందిని కూడా నియమించనున్నారు.
News December 8, 2025
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ కట్టడికి చర్యలు

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి మొక్కల్లో దిగుబడి, కాయ నాణ్యత పెంచడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 1.5 గ్రాములు జింక్ సల్ఫేట్ & ఒక గ్రాము బోరాన్ కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. అలాగే వంగ, గుమ్మడి జాతి పంటలను బొప్పాయి చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిశ రెండు వరుసలు, మొక్కజొన్న, జొన్న మొక్కలను రెండు వరుసల్లో రక్షణ పంటలుగా వేసుకోవాలి.


