News March 23, 2025

సీట్లే కాదు పార్లమెంటులో ప్రాధాన్యత కోసం పోరాటం: కేకే

image

TG: పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఇంకా పెరగాలని ప్రభుత్వ సలహాదారు K కేశవరావు ఆకాంక్షించారు. ఎంపీ సీట్ల గురించే కాకుండా పార్లమెంటులో తమ గళానికి ప్రాధాన్యత కోసం రాష్ట్రాలు పోరాడుతున్నాయని చెప్పారు. అన్ని రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే కేంద్రం డీలిమిటేషన్‌పై ముందుకెళ్లాలని సూచించారు. పార్లమెంటులో చట్టం ఆమోదం పొందాకే పునర్విభజన చేయాలన్నారు.

Similar News

News April 25, 2025

భారత్ ఏం చేసినా మద్దతిస్తాం: ప్రపంచ నేతలు

image

పహల్‌గామ్ నరమేధానికి ప్రతీకారంగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తామని UK MP బాబ్ బ్లాక్‌మెన్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ మిలిటరీ యాక్షన్ చేపట్టినా తమ దేశంలోని పార్టీలన్నీ సపోర్ట్ చేస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ PM మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ కష్టసమయంలో భారత్‌కు తమ దేశం అండగా ఉంటుందన్నారు.

News April 25, 2025

నేటి నుంచి స్పౌజ్ పెన్షన్లకు దరఖాస్తులు

image

AP: స్పౌజ్ పెన్షన్లపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ మధ్య పెన్షన్ పొందుతూ చనిపోయిన భర్తల స్థానంలో భార్యలకు పింఛన్ ఇవ్వనుంది. ఇందుకు ఇవాళ్టి నుంచి గ్రామ, వార్డు సచివాలయల్లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ నెల 30లోపు వివరాలు సమర్పిస్తే మే 1 నుంచి దాదాపు 89వేల మందికి కొత్తగా పెన్షన్ అందనుంది.

News April 25, 2025

బొట్టు తీసేసినా వదల్లేదు.. చంపేసి నవ్విన ఉగ్రఘాతకులు

image

పహల్గామ్‌లో అమాయకులను కాల్చి చంపిన టెర్రరిస్టుల దురాగతాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. తమ నుదుటిన బొట్టు తీసేసి, అల్లాహు అక్బర్ అని నినాదాలు చేసినా తన భర్త కౌస్తుభ్ గన్బోటేను చంపేశారని సంగీత(పుణే) కన్నీటిపర్యంతమయ్యారు. తర్వాత చిన్ననాటి స్నేహితుడు సంతోష్‌నూ కాల్చేశారని చెప్పారు. తన భర్త శైలేష్‌తో సహా ముగ్గురిని చంపేసి ఉగ్రవాదులు పగలబడి నవ్వారని శీతల్‌బెన్(అహ్మదాబాద్) రోదించారు.

error: Content is protected !!