News August 5, 2024
ఉద్దేశపూర్వకంగానే చెత్తకుప్పలో ఫైళ్లు!

AP: ఇటీవల గుంటూరు ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణలో చెత్తకుప్పలో ఫైళ్లు కనిపించిన కేసును పోలీసులు ఛేదించినట్లు తెలుస్తోంది. కొందరు ఉద్దేశపూర్వకంగానే చెత్తకుప్ప వద్ద ఫైళ్లను పెట్టి, వీడియో తీసి వైరల్ చేసినట్లు గుర్తించారు. రాష్ట్రంలో ఫైళ్ల దహన ఘటనలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో కావాలనే ఇలా చేసినట్లు తేల్చారు. విజయవాడలోని యనమలకుదురు, మదనపల్లిలో ఫైళ్ల దహనం ఘటనలు చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే.
Similar News
News December 11, 2025
తిలక్ వర్మ అద్భుత హాఫ్ సెంచరీ

రెండో టీ20లో తడబడిన భారత్ బ్యాటింగ్ను తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గాడిలో పెట్టారు. 44 రన్స్పై ఉండగా అదిరిపోయే సిక్సర్ బాది హాఫ్ సెంచరీ నమోదు చేశారు. బిగ్ ఛేజింగ్ గేమ్లో టాపార్డర్ కుప్పకూలగా పాండ్య(20)తో కలిసి తిలక్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. జట్టు కష్టాల్లో ఉండగా క్రీజులో పాతుకుపోయి సత్తా చాటుతున్నారు. ఓవైపు వికెట్లు పడుతున్నా జట్టు విజయం కోసం కృషి చేస్తున్నారు.
News December 11, 2025
మయన్మార్ ఆర్మీ దాడులు.. 34 మంది మృతి

తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ టార్గెట్గా మయన్మార్ ఆర్మీ జరిపిన వైమానిక దాడిలో 34 మంది మరణించారు. బుధవారం రాత్రి ఫైటర్ జెట్ రెండు మిస్సైల్స్ వేయడంతో రఖైన్ రాష్ట్రం మ్రౌక్-యు టౌన్షిప్లో అరకన్ ఆర్మీ అధీనంలోని ఆసుపత్రి పూర్తిగా ధ్వంసమైంది. దాడిలో వైద్య సిబ్బంది, పేషెంట్స్ మరణించినట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. 17 మంది మహిళలు, 17 మంది పురుషులు మృతిచెందగా మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు.
News December 11, 2025
రైతులకు గుడ్ న్యూస్.. రేపు ఖాతాల్లోకి డబ్బులు

TG: మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాలను రేపట్నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొత్తం 55,904 మంది రైతుల అకౌంట్లలో ₹585 కోట్లు జమ అవుతాయన్నారు. ఇప్పటి వరకు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరించినట్లు చెప్పారు. కేంద్రం సహకరించకున్నా రైతులు నష్టపోరాదని తామే సేకరిస్తున్నట్లు వివరించారు. రైతుల శ్రేయస్సే తమ తొలి ప్రాధాన్యమన్నారు.


