News November 26, 2024
29న ఛాంపియన్స్ ట్రోఫీపై ఫైనల్ డెసిషన్?

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఈ నెల 29న ICC తుది నిర్ణయం వెలువరించనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్, భారత్ పర్యటన, హైబ్రిడ్ మోడల్ వంటి విషయాలపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తుందని సమాచారం. కాగా హైబ్రిడ్ మోడల్కు పీసీబీ అంగీకరిస్తే ఆర్థిక ప్రోత్సాహకాలు మరింత పెంచుతామని ICC ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. భారత్ మ్యాచులను UAEలో నిర్వహించాలని, ఫైనల్కు చేరుకుంటే దుబాయ్లో జరపాలని పాక్ను కోరినట్లు సమాచారం.
Similar News
News April 15, 2026
CBSE టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడు?.. విద్యార్థుల ఎదురుచూపులు

సీబీఎస్ఈ టెన్త్ రిజల్ట్స్ కోసం స్టూడెంట్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నిన్నే విడుదల అవుతాయని జాతీయ మీడియాలో ప్రచారం జరగడంతో అధికారిక వెబ్సైట్ను పదేపదే చెక్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. రిజల్ట్స్పై కచ్చితమైన డేట్ అండ్ టైమ్ ప్రకటించాలని విద్యార్థులు, పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
News April 15, 2026
డీలిమిటేషన్.. సరిహద్దులను ఎలా నిర్ణయిస్తారు?

డీలిమిటేషన్తో దేశంలో కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. కొత్త, పాత నియోజకవర్గాల సరిహద్దులను డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. నదులు, కొండలు వంటి సహజ సరిహద్దులు, జిల్లాల బార్డర్స్, రవాణా, పరిపాలనా సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రతి సీటులో సమాన సంఖ్యలో జనాభా ఉండేలా, అసెంబ్లీ సెగ్మెంటు ఏదో ఒక పార్లమెంటు పరిధిలోకి వచ్చేలా చూస్తుంది. SC, ST జనాభా ఎక్కువున్న చోట రిజర్వేషన్ కల్పిస్తుంది.
News April 15, 2026
నేడే ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ఇంటర్ ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉదయం 10.31 గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. మొత్తం 10.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. స్టూడెంట్స్ మన Way2newsలో సూపర్ ఫాస్ట్గా, సులభంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే వచ్చే స్క్రీన్పై మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో మార్కుల లిస్ట్ ప్రత్యక్షమవుతుంది.
* ALL THE BEST


