News September 9, 2025

హిమాచల్‌ప్రదేశ్‌కు రూ.1500 కోట్ల ఆర్థిక సాయం

image

భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన హిమాచల్‌ప్రదేశ్‌కు ప్రధాని మోదీ రూ.1500 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇవాళ ఆ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన నష్ట తీవ్రతపై అధికారులతో సమీక్షించారు. వరదలు, ప్రకృతి విపత్తులో చనిపోయిన వారి కుటుంబానికి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. కాసేపట్లో ప్రధాని పంజాబ్‌‌కు చేరుకోనున్నారు.

Similar News

News September 10, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నికలో క్రాస్ ఓటింగ్?

image

ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచిన NDA అభ్యర్థికి 452 ఓట్లు పోలయ్యాయి. ఎన్డీఏకు 427+11(వైసీపీ) ఎంపీల సపోర్ట్ ఉంది. దీని ప్రకారం NDAకు 438 ఓట్లు పోలవ్వాల్సి ఉండగా 14 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇవి క్రాస్ ఓటింగ్ ఓట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు ఇండీ కూటమి ఎంపీలు 315మంది ఓట్లేశారని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. కానీ ఫలితాల్లో వారి అభ్యర్థికి 300 ఓట్లే పడ్డాయి. మరోవైపు 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు.

News September 10, 2025

ఇది కదా విజయం అంటే..!❤️

image

మన పనులను నిబద్ధతతో చేస్తే గుర్తింపు, అవకాశాలు వాటంతటవే వస్తాయని నిరూపించారు అస్సాంకు చెందిన 27ఏళ్ల సత్యజిత్ బోరా. గ్రామాల్లో జరిగే వాలీబాల్ గేమ్స్‌ను ఈయన మొబైల్ ద్వారా ప్రసారం చేసేవారు. దీంతో సత్యజిత్ అభిరుచిని గుర్తించిన అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య (FIVB) ప్రపంచ స్థాయి వాలీబాల్ ఈవెంట్‌ బ్రాడ్ కాస్టింగ్ తీరును దగ్గరుండి చూసేందుకు ఆహ్వానించింది. గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్లి సత్తా చాటారు.

News September 10, 2025

నేపాల్‌లో శాంతికి పిలుపునిచ్చిన మోదీ

image

నేపాల్‌లో యువత ఆందోళనలతో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ప్రధాని మోదీ X వేదికగా స్పందించారు. ‘నేపాల్‌లో చోటుచేసుకున్న హింస హృదయవిదారకం. ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి పరిస్థితులపై సెక్యూరిటీ క్యాబినెట్ కమిటీ చర్చించింది. నేపాల్‌లో స్థిరత్వం, శాంతి, శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం. శాంతికి మద్దతివ్వాలని నేపాలీ సోదర, సోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన పిలుపునిచ్చారు.