News December 8, 2024
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది: కిషన్ రెడ్డి

TG: KCR, రేవంత్ కవల పిల్లలని, ఆ పార్టీల DNA ఒకటే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం రాబోతోందని తెలిపారు. పదేళ్లలో KCR, ఏడాది గడిచినా రేవంత్ ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వలేదన్నారు. హామీలను కాంగ్రెస్ మరిచిపోయిందని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కి 8 సీట్లు, BJPకి 8 సీట్లు వచ్చాయని, రాష్ట్రంలో BJP బలపడాలని ప్రజలు కోరుకుంటున్నారని సరూర్నగర్ సభలో చెప్పారు.
Similar News
News July 8, 2025
GREAT: 67 ప్రాణాలు కాపాడిన కుక్క..!

హిమాచల్ ప్రదేశ్ వరదల్లో ఓ కుక్క 67 మంది ప్రాణాలను కాపాడింది. గత నెల 30న అర్ధరాత్రి మండి జిల్లా సియాథిలో ఓ కుక్క అరుపులు విని గ్రామస్థుడు నరేంద్ర నిద్ర లేచాడు. ఆ సమయంలో ఇంట్లోని గోడకు పగుళ్లు, నీరు లీక్ కావడం గమనించి గ్రామస్థులందరినీ అప్రమత్తం చేశాడు. వారు వెంటనే గ్రామాన్ని విడిచారు. కాసేపట్లోనే కొండచరియలు విరిగిపడి ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. కుక్క అరుపు వల్ల 20 కుటుంబాలు సురక్షితంగా బయటపడ్డాయి.
News July 8, 2025
క్రికెట్ ఇండోర్ స్టేడియంలో ఎందుకు ఆడరు?

క్రికెట్ పిచ్, ఔట్ ఫీల్డ్, భారీ సంఖ్యలో వచ్చే ప్రేక్షకులకు ఇండోర్ స్టేడియం సరిపోదు. పిచ్, బౌలింగ్లో స్వింగ్, సీమ్ వాతావరణ మార్పులను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని దేశాల్లో ఇండోర్ క్రికెట్ ఆడుతున్నారు. అయితే వాటి రూల్స్ భిన్నంగా ఉంటాయి. ICC మాత్రం అధికారికంగా ఇలాంటి మ్యాచ్లు నిర్వహించట్లేదు. పైకప్పును బంతి తాకితే దాన్ని ఎలా పరిగణించాలనే విషయంలో గందరగోళం కూడా దీనికి కారణం.
News July 8, 2025
చలాన్లు పెండింగ్లో ఉంటే లైసెన్స్ సస్పెండ్?

TG: ట్రాఫిక్ చలాన్లు చెల్లించనివారిపై చర్యలకు రవాణాశాఖ సిద్ధమైంది. మూడు నెలల పాటు పెండింగ్లో ఉంటే లైసెన్స్ సస్పెండ్ చేయాలన్న పోలీసుల ప్రతిపాదనలపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నిర్ణయంతో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణకు కళ్లెం వేయడంతో పాటు భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత 7 నెలల్లో పదేపదే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన 18,973 మంది లైసెన్స్లను అధికారులు సస్పెండ్ చేశారు.