News February 20, 2025

జగన్ వల్లే ఆర్థిక ఇబ్బందులు: పవన్

image

AP: రాష్ట్రంలో సమన్వయంతో కలిసి నడుస్తున్నామని Dy.CM పవన్ అన్నారు. వెన్నునొప్పి కారణంగా కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని, ఇప్పటికీ ఆ నొప్పి వేధిస్తోందని తెలిపారు. ఇచ్చిన హామీలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. అందువల్లే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అయినా హామీలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని వివరించారు.

Similar News

News November 14, 2025

4 రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. నాలుగో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 9వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు 4 రౌండ్లలోనూ ఆయన లీడ్ సాధించారు. BRSకు మూడో రౌండ్‌లోని ఒక EVMలో స్వల్ప ఆధిక్యం వచ్చింది. ప్రస్తుతం ఐదో రౌండ్ ఓట్లు లెక్కిస్తున్నారు.

News November 14, 2025

వంటింటి చిట్కాలు

image

* పండ్లు, కూరగాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే వేడినీళ్లలో రెండు టేబుల్‌ స్పూన్ల వెనిగర్‌ వేసి కడగాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి.
* దోసెలు పెనానికి అతుక్కుపోకుండా ఉండాలంటే ముందుగా పెనంపై వంకాయ లేదా ఉల్లిపాయ ముక్కతో రుద్దితే చాలు.
* కాకరకాయ కూరలో సోంపు గింజలు/ బెల్లం వేస్తే చేదు తగ్గుతుంది.
* పుదీనా చట్నీ కోసం మిక్సీలో పదార్థాలని ఎక్కువ సేపు తిప్పకూడదు. ఇలా చేస్తే చేదుగా అయిపోతుంది.

News November 14, 2025

ఒకేరోజు ఓటీటీలోకి వచ్చేసిన 3 సినిమాలు

image

ఇవాళ ఏకంగా మూడు సినిమాలు ఒకే OTTలోకి వచ్చేశాయి. సిద్ధు, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన ‘తెలుసు కదా’, ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘డ్యూడ్’, ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వర్ కలిసి నటించిన ‘బైసన్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. విడుదలైన నెల రోజుల‌లోపే ఈ చిత్రాలు స్ట్రీమింగ్‌కు రావడం గమనార్హం.