News April 24, 2024

కోహ్లీకి జరిమానా

image

ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ అడ్వైజరీ జరిమానా విధించింది. నిన్న KKRతో మ్యాచ్‌లో అంపైర్లతో వాగ్వివాదంతో మ్యాచు ఫీజులో 50 శాతం కోత వేసింది. నిన్న కోహ్లీ ఔటైన తీరు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారమే ఔట్‌ ఇచ్చినట్లు స్టార్ స్పోర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు స్లో ఓవర్ రేట్ కారణంగా డుప్లెసిస్, సామ్ కరన్‌కు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

Similar News

News January 29, 2026

రైల్వేలో 312 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

రైల్వే ఐసోలేటెడ్ కేటగిరీలో 312 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, LLB, MBA, డిప్లొమా, PG(హిందీ, ఇంగ్లిష్, సైకాలజీ) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. CBT(1, 2), స్కిల్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.19,900-రూ.44,900 వరకు చెల్లిస్తారు. సైట్: www.rrbcdg.gov.in/

News January 29, 2026

UGC రూల్స్‌పై సుప్రీం స్టే

image

UGC ప్రవేశపెట్టిన కొత్త రూల్స్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ వరకు 2012 రూల్స్‌ అమలులో ఉంటాయని తెలిపింది. యూజీసీ కొత్తగా ప్రవేశపెట్టిన రూల్స్ అస్పష్టంగా ఉన్నాయని, దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉందని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. కేంద్రానికి నోటీసులు జారీ చేసిన CJI విచారణను మార్చి 19కి వాయిదా వేశారు.

News January 29, 2026

కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. రేపు 3pmకు విచారణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు సిట్ నోటీసులిచ్చింది. HYD నందినగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు CRPC 160 కింద మాజీ సీఎం పీఏకు నోటీసులు అందించారు. రేపు 3pmకు విచారణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. 65సం.లకు పైగా వయస్సు ఉండటంతో స్టేషన్‌కు రావడం తప్పనిసరి కాదని తెలిపారు. PSకు రావాలి అనుకుంటే రావచ్చు, లేదా HYD పరిధిలో ఆయన కోరిన చోట విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.