News December 10, 2024
ఎవరైనా చనిపోతే వేళ్లు నరికేసుకునేవారు!

పసిఫిక్ ద్వీప దేశమైన పాపువా న్యూగినియా ప్రజలు గతంలో ఓ విచిత్రమైన ఆచారాన్ని పాటించారు. అక్కడి కొన్ని జాతుల వారు కుటుంబసభ్యులెవరైనా చనిపోతే సంతాపంగా తమ వేళ్లను నరికేసుకునేవారు. ఇది తీవ్ర దుఃఖాన్ని, నష్టాన్ని వ్యక్తీకరిస్తుందని వారి భావన. సంప్రదాయ పరికరాలతోనే వేలి పైభాగాన్ని కట్ చేసి, సహజ పద్ధతులతో గాయాలకు చికిత్స చేసేవారు. కాలక్రమేణా ఆధునికీకరణ, చట్టపరమైన పరిమితుల కారణంగా ఈ ఆచారం కనుమరుగైపోయింది.
Similar News
News December 13, 2025
దేశంలో రోడ్డు లింక్ లేని గ్రామాలు 40547: కేంద్రం

స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లవుతున్నా దేశంలో ఇంకా 40547 గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు. ఈ జాబితాలో MPలో 9246, గుజరాత్లో 2443, ఛత్తీస్గఢ్లో 2692, J&Kలో 2262, ఝార్ఖండ్ 2787, కేరళ 2335, WBలో 2748 గ్రామాలున్నాయి. APలో 413, TGలో 173 గ్రామాలకు రోడ్ల లింకేజ్ లేదని కేంద్రం వెల్లడించింది. PMGSY కింద 2029 నాటికి వీటికి రోడ్ల కనెక్టివిటీ చేపడతామని పేర్కొంది. పార్లమెంటులో ఓ సభ్యుడి ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.
News December 13, 2025
మోగ్లీ మూవీ రివ్యూ&రేటింగ్

ప్రేమించిన యువతి కోసం క్రిమినల్ పోలీస్తో హీరో చేసే పోరాటమే మూవీ కథ. రోషన్ యాక్టింగ్, బధిర యువతిగా హీరోయిన్, బండి సరోజ్ నటన మెప్పిస్తాయి. వైవా హర్ష కామెడీ నవ్వులు పూయిస్తుంది. మ్యూజిక్ ఫర్వాలేదు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లవ్స్టోరీ రొటీన్గా అనిపిస్తుంది. సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించవు. ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతుంది. కర్మ సిద్ధాంతంతో లింక్ పెట్టి సందీప్ రాజ్ కథ అల్లారు.
రేటింగ్:2.25/5
News December 13, 2025
వారితో కేరళ విసిగిపోయింది: మోదీ

తిరువనంతపురం కార్పొరేషన్లో NDA <<18552178>>గెలవడం<<>>పై ప్రధాని మోదీ స్పందించారు. ‘థాంక్యూ తిరువనంతపురం. ఈ గెలుపు కేరళ రాజకీయాల్లో కీలక మలుపు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలను మా పార్టీ మాత్రమే తీర్చగలదని ప్రజలు నిశ్చయించుకున్నారు. UDF, LDFతో కేరళ విసిగిపోయింది. వికసిత్ కేరళకు, సుపరిపాలనకు మరో ఆప్షన్గా ఎన్డీయేను ప్రజలు చూస్తున్నారు’ అని పలు ట్వీట్లు చేశారు. BJP-NDAకు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.


