News December 10, 2024
ఎవరైనా చనిపోతే వేళ్లు నరికేసుకునేవారు!

పసిఫిక్ ద్వీప దేశమైన పాపువా న్యూగినియా ప్రజలు గతంలో ఓ విచిత్రమైన ఆచారాన్ని పాటించారు. అక్కడి కొన్ని జాతుల వారు కుటుంబసభ్యులెవరైనా చనిపోతే సంతాపంగా తమ వేళ్లను నరికేసుకునేవారు. ఇది తీవ్ర దుఃఖాన్ని, నష్టాన్ని వ్యక్తీకరిస్తుందని వారి భావన. సంప్రదాయ పరికరాలతోనే వేలి పైభాగాన్ని కట్ చేసి, సహజ పద్ధతులతో గాయాలకు చికిత్స చేసేవారు. కాలక్రమేణా ఆధునికీకరణ, చట్టపరమైన పరిమితుల కారణంగా ఈ ఆచారం కనుమరుగైపోయింది.
Similar News
News November 26, 2025
భారత్ చెత్త రికార్డు

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో ఓడిన టీమ్ ఇండియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్టు క్రికెట్లో రన్స్ పరంగా భారత్కు ఇదే అతిపెద్ద పరాజయం. 2004లో 342(vsAUS), 2006లో 341(vsPAK), 2007లో 337(vsAUS), 2017లో 333(vsAUS) పరుగుల తేడాతో IND ఓడిపోయింది. తాజా ఓటమితో WTC 2025-27 సీజన్లో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. తొలి 4 స్థానాల్లో ఆసీస్, సౌతాఫ్రికా, శ్రీలంక, పాక్ ఉన్నాయి.
News November 26, 2025
ధర్మబద్ధమైన మార్గంలో నడిపించే నామం

విష్ణుం జిష్ణు మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ |
అనేకరూప దైత్యాన్తం నమామి పురుషోత్తమమ్ ||
జయశీలుడు, విశ్వమంతా వ్యాపించినవాడు, మహేశ్వరుడు, అనేక రూపాలలో దుష్టులను సంహరించినవాడు, ఉత్తమ పురుషుడైన ఆ విష్ణు దేవునికి భక్తితో నమస్కరించాలని ఈ శ్లోకం చెబుతోంది. ఫలితంగా శ్రీవారి అనుగ్రహంతో అనేక కష్టాలు, సవాళ్లను జయిస్తామని ప్రతీతి. ఈ విష్ణునామం మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుందని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 26, 2025
RRCATలో 150 పోస్టులు.. అప్లైకి ఇవాళే ఆఖరు తేదీ

రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ(<


