News January 31, 2025
రాష్ట్రంలో GBS తొలి కేసు నమోదు

మహారాష్ట్రలో విజృంభిస్తున్న <<15225307>>గిలియన్ బార్ సిండ్రోమ్<<>> (GBS) తెలంగాణలో కలకలం రేపింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ మహిళలో ఈ సిండ్రోమ్ లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆమె HYD కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇది అంటువ్యాధి కాదని, నయం చేయవచ్చని తెలిపారు.
Similar News
News December 2, 2025
తల్లీకూతుళ్ల బంధం ప్రత్యేకం

తల్లీకొడుకూ, తండ్రీకూతుళ్ల బంధాల గురించే అందరూ ప్రస్తావిస్తారు. కానీ తల్లీకూతుళ్ల బంధం ప్రత్యేకమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, అవగాహన, కూతురు పెరిగే క్రమంలో స్వేచ్ఛగా పంచుకున్న ఆలోచనలు, భావాలు, అనుభవాలతోపాటు హార్మోన్లు దీనికి కారణమని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. భావోద్వేగాల్ని నియంత్రించే మెదడు నిర్మాణం ఇద్దరిలో ఒకేలా ఉండటమూ ఈ బలమైన బంధానికి ఓ కారణమట.
News December 2, 2025
చంద్రబాబు కేసులను మూసివేయిస్తున్నారు: MLC బొత్స

AP: తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించేందుకు CM <<18441609>>చంద్రబాబు<<>> అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని YCP MLC బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఫిర్యాదుదారులను బెదిరించి కేసులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని విమర్శించారు. “స్కిల్, అసైన్డ్ ల్యాండ్స్, రింగ్రోడ్, ఫైబర్నెట్, లిక్కర్ సహా పలు కేసులు ఉన్నప్పటికీ.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిలో పురోగతి లేదు. గవర్నర్ చర్యలు తీసుకోవాలి” అని కోరారు.
News December 2, 2025
ఉచితంగా క్రికెట్ మ్యాచులు చూసే అవకాశం

క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. హైదరాబాద్లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ మ్యాచులను ఫ్రీగా చూసేందుకు అభిమానులను అనుమతిస్తున్నారు. స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, షమీ, హర్షల్ పటేల్తో పాటు పలువురు ప్లేయర్లు ఈ సిరీస్లో ఆడుతున్నారు. ఉప్పల్తో పాటు జింఖానా, ఎల్బీ స్టేడియాల్లో మ్యాచులు జరుగుతున్నాయి. షెడ్యూల్ <


