News January 27, 2025

GBSతో మహారాష్ట్రలో తొలి మరణం

image

గిలియన్-బార్ సిండ్రోమ్(GBS)తో భారత్‌లో తొలి మరణం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ అనారోగ్యంతో ఒకరు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోగుల సంఖ్య 101కి చేరిందని, వారిలో 16మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని పేర్కొంది. జీబీఎస్ అనేది అరుదైన నరాల సంబంధిత అనారోగ్యం. ఇది తలెత్తిన వారిలో సొంత రోగ నిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుంది.

Similar News

News February 14, 2025

తెలంగాణ ఉద్యమంపై పుస్తకాలు రావాలి: CM

image

తెలంగాణ ఉద్యమ చరిత్రపై మరిన్ని సమగ్రమైన పుస్తకాలు రావాలని CM రేవంత్ ఆకాంక్షించారు. మాజీ MP దేవేందర్ గౌడ్ రాసిన విజయ తెలంగాణ పుస్తకాన్ని CM ఆవిష్కరించారు. ‘TG ఉద్యమంపై లోతైన చర్చ జరగాలి. ఎన్నో వర్గాలు పాల్గొన్నా, ఒక కుటుంబమే పాల్గొన్నట్లు వక్రీకరించారు. ఉద్యమం టైంలో ప్రజలంతా తమ వాహనాలు, ఆఫీసులు, గుండెలపై TG అని రాసుకున్నారు. ఇప్పుడు ప్రజలు కోరుకున్నట్లుగానే TSను TGగా మార్చాం’ అని CM వెల్లడించారు.

News February 14, 2025

అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు

image

AP: రాజధాని అమరావతిని అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం లేదా CMO నామినేట్ చేసిన వారిని ఎంపిక చేయాలని ఉత్తర్వులిచ్చింది. వివిధ రంగాల్లో నిపుణులు, ప్రజల్లో మమేకమైన వారిని నైపుణ్యం, అర్హతల ఆధారంగా ఏడాది కాలానికి నియమించనున్నట్లు పేర్కొంది. అమరావతికి పెట్టుబడులను ఆకర్షించేందుకు వీరు కృషి చేయాల్సి ఉంటుంది.

News February 14, 2025

ప్రేమికుల రోజు భార్యలతో క్రికెటర్లు!

image

వాలంటైన్స్ డే సందర్భంగా పలువురు క్రికెటర్లు తాము ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యలతో గడిపారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి స్పెషల్ లంచ్‌కు వెళ్లిన ఫొటోను షేర్ చేశారు. మరో కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తూ సందడిగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

error: Content is protected !!