News February 10, 2025
హిస్టరీలో ఫస్ట్ టైమ్: భారత్లో రష్యన్ Su-57, అమెరికన్ F-35

బెంగళూరు ‘ఏరో ఇండియా’ మెగా ఈవెంట్ సరికొత్త రికార్డు సృష్టించింది. చరిత్రలో తొలిసారి రష్యన్ Su-57, అమెరికన్ F-35 లైటెనింగ్ 2 విమానాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఆయా దేశాలు తలమానికంగా భావించే ఈ స్టెల్త్ ఫైటర్స్ను ఒకదానికొకటి పోటీగా భావిస్తారు. సాధారణంగా Su-57 కొనే దేశాలకు F-35ని విక్రయించరు. భారత్ అతిపెద్ద మార్కెట్ కావడంతో ఇక్కడ ప్రదర్శనకు ఉంచినట్టు తెలిసింది. ఫ్రాన్స్ రాఫెల్ విమానాలూ వచ్చాయి.
Similar News
News March 25, 2025
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాపై మోహన్ లాల్ కామెంట్స్

మోహన్ లాల్ ‘లూసిఫర్’ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో చిరంజీవి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై మోహన్ లాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గాడ్ ఫాదర్ను తాను చూశానని, సినిమాలో కొన్ని పాత్రలు, సీన్లు తీసేశారని చెప్పారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చారన్నారు. అయితే లూసిఫర్-2తో గాడ్ ఫాదర్-2 తీయలేరని, ఇందులోని పాత్రలను తీసేయడం అసాధ్యమన్నారు. కాగా ‘L2:ఎంపురాన్’ ఎల్లుండి థియేటర్లలో రిలీజ్ కానుంది.
News March 25, 2025
మహిళలకు తగ్గిన లీడర్షిప్ పొజిషన్లు: టీమ్లీజ్

హయ్యర్ లీడర్షిప్ స్థాయుల్లో మహిళల ప్రాతినిధ్యం సగటున 19%కి తగ్గినట్టు టీమ్లీజ్ రిపోర్టు తెలిపింది. ఎంట్రీ లెవల్ పొజిషన్లలో 46% ఉన్నట్టు పేర్కొంది. ఇక వారి నిరుద్యోగ రేటు 2.9 నుంచి 3.2%కి పెరిగిందని వెల్లడించింది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ బాగుందంది. కన్జూమర్ సర్వీసెస్, రిటైల్, విద్య వంటి రంగాల్లో వారికి సీ-సూట్ పొజిషన్లు ఎక్కువగా దక్కుతున్నాయి.
News March 25, 2025
హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్ల కీలక నిర్ణయం

TG: హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్నిప్రమాదాలు, వరద ముంపు నివారణకు రెండు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు చెరువుల సంరక్షణ, సుందరీకరణ, పునరుద్ధరణపై చర్చించారు.