News February 12, 2025

జట్టులోకి ఐదుగురు స్పిన్నర్లు.. ప్లానేంటో?

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన భారత జట్టులోకి ఐదుగురు స్పిన్నర్లను తీసుకోవడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ వంటి పిచ్‌లపై స్పీడ్ స్టార్లను వదిలేసి వరుణ్, కుల్దీప్, రవీంద్ర, అక్షర్, సుందర్‌ వంటి ప్లేయర్లను ఎంపిక చేయడం వెనుక ఉద్దేశం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గాయంతో బుమ్రా దూరమవ్వగా శార్దూల్, సిరాజ్ వంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మరి మీ కామెంట్?

Similar News

News March 20, 2025

చరిత్ర సృష్టించిన ‘ఛావా’

image

శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ చరిత్ర సృష్టించింది. ‘బుక్‌ మై షో’లో 12 మిలియన్ టికెట్లు సేల్ అయిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. దేశంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు(రూ.767కోట్లు), విడుదలైన ఐదో వారంలో రూ.22కోట్లు వసూలు చేసిన తొలి మూవీగానూ హిస్టరీ క్రియేట్ చేసింది. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా FEB 14న రిలీజైన విషయం తెలిసిందే.

News March 20, 2025

వీరు షెఫ్‌లే.. కానీ ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే

image

షెఫ్‌లే కదా అని వారిని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. వారి ఆస్తులు రూ.కోట్లలో ఉంటాయి మరి. ప్రకటనల్లో తరచూ కనబడే సంజీవ్ కపూర్ దేశంలోని షెఫ్‌లలో అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి విలువ రూ.1165 కోట్లకు పైమాటే. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వికాస్ ఖన్నా(సుమారు రూ.120 కోట్లు), రణ్‌వీర్ బ్రార్(రూ.41 కోట్లు), కునాల్ కపూర్ (రూ.43.57 కోట్లు), గరిమా అరోరా (రూ.40 కోట్లు), హర్‌పాల్ సింగ్ సోఖి(రూ.35 కోట్లు) ఉన్నారు.

News March 20, 2025

రాత్రి 7 గంటలలోపు ఈ పని చేస్తే?

image

రాత్రి 7 గంటలలోపు భోజనం చేయకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 7 గంటలకు ముందే డిన్నర్ చేస్తే ఆయుర్దాయం 35 శాతం పెరుగుతుందని చెబుతున్నారు. త్వరగా భోజనం చేస్తే జీర్ణం కావడానికి, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది. డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. బరువు తగ్గే అవకాశం ఉంది. గుండె జబ్బులు వచ్చే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది.

error: Content is protected !!