News February 1, 2025

FLASH.. గద్వాల: జాతీయ రహదారిపై లారీని ఢీకొన్న బస్సు

image

ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో 44 జాతీయ రహదారిపై రెండు బస్సులు ఒక లారీని ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు.. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బస్సు యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొంది. వెనకనే వస్తున్న మరో బస్సు ముందున్న బస్సును ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ చంద్రశేఖర్ తో పాటు ఆరుగురికి గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 1, 2025

SSM29 గురించి జక్కన్న చెప్పేది అప్పుడేనా?

image

మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో తెరకెక్కే SSMB29 షూటింగ్ విజయవాడ సమీపంలో వేసిన సెట్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ నిబంధనల విషయంలో దర్శకుడు చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు టాక్. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న జక్కన్న, తర్వాతి షెడ్యూల్‌ కెన్యా అడవుల్లో ప్లాన్ చేశారని టాలీవుడ్ వర్గాలంటున్నాయి. అది పూర్తయ్యాక మూవీ టీమ్ గురించి వీడియోలో లేదా ఈవెంట్‌లో వివరించనున్నట్లు సమాచారం.

News February 1, 2025

రామగుండం: అధికారులతో సింగరేణి C&MD వీడియో కాన్ఫరెన్స్

image

రామగుండం సింగరేణి సంస్థ జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో C&MDబలరాం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానించబడిన అటవీ భూమి మళ్లింపులు, పర్యావరణ క్లియరెన్స్ తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు. అధికారులు గోపాల్ సింగ్, ఆంజనేయ ప్రసాద్, కుమార స్వామి, కర్ణ, వీరారెడ్డి తదితరులున్నారు.

News February 1, 2025

కేంద్ర మంత్రితో బాపట్ల ఎంపీ భేటీ

image

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి H.D కుమారస్వామిని బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్ సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ నిమిత్తం రూ.11,440 కోట్లు కేటాయించినందుకు ఆయనకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు విషయాలను ప్రస్తావించారు.