News April 2, 2024
HYD నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు

అయోధ్యలోని బాల రాముడి దర్శనానికి వెళ్లే భక్తులకు శంషాబాద్ ఎయిర్పోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు నుంచి హైదరాబాద్-అయోధ్య మధ్య విమాన సర్వీస్ నడిపేలా స్పైస్జెట్తో ఒప్పందం కుదుర్చుకుంది. SG611 విమానం రోజూ HYD నుంచి 10.45 గంటలకు బయలుదేరి 12.45 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. రిటర్న్ ఫ్లైట్ SG616 అయోధ్య నుంచి 13.25 గంటలకు బయలుదేరి 15.25 గంటలకు HYDకి వస్తుంది.
Similar News
News December 7, 2025
మీ ఇంట్లో ఏడు గుర్రాల చిత్ర పటం ఉందా?

పరిగెడుతున్న 7 గుర్రాల చిత్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉత్తర దిశలో ఉంచితే సిరి సంపదలకు లోటుండదని, దక్షిణ దిశలో ఉంచితే చేసే పనుల్లో విజయం లభిస్తుందని అంటున్నారు. ‘ఈ చిత్రం శ్రేయస్సు, విజయాన్ని సూచిస్తుంది. దీన్ని పూజా మందిరంలోనే పెట్టాల్సిన అవసరం లేదు. సూర్య భగవానుడి వాహనం అయిన రథాన్ని ఈ తెలుపు గుర్రాలే లాగుతాయి’ అని వివరిస్తున్నారు.
News December 7, 2025
అర్ధరాత్రి తినే అలవాటు ఎంత ప్రమాదమంటే?

అర్ధరాత్రి తినే అలవాటు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘లేట్ నైట్ తినే అలవాటు మీ నిద్ర, జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. రాత్రి సమయంలో మీ శరీరం ఫ్యాట్ని బర్న్ చేస్తుంది. కానీ, మీరు తినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ మోడ్ కాస్తా స్టోరేజ్ మోడ్కు వెళ్తుంది. దాంతో మీ శరీరం బరువు పెరుగుతుంది. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది’ అని చెబుతున్నారు.
News December 7, 2025
న్యాయం చేయండి.. మోదీకి పాక్ మహిళ అభ్యర్థన

తనకు న్యాయం చేయాలని ప్రధాని మోదీని పాకిస్థాన్ మహిళ కోరారు. తన భర్త విక్రమ్ నాగ్దేవ్ కరాచీ నుంచి లాంగ్ టర్మ్ వీసాపై ఇండోర్(MP) వచ్చి అక్కడే ఉంటున్నాడని పేర్కొన్నారు. అతను ఢిల్లీకి చెందిన మరో యువతితో పెళ్లికి సిద్ధమైనట్టు తెలిసిందని చెప్పారు. జనవరిలో కేసు ఫైల్ చేసినా లీగల్గా న్యాయం జరగలేదన్నారు. ప్రధాని మోదీ న్యాయం చేయాలంటూ అభ్యర్థించిన వీడియో వైరలవుతోంది. దీనిపై లీగల్ బాడీస్ మండిపడుతున్నాయి.


