News April 2, 2024
HYD నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు

అయోధ్యలోని బాల రాముడి దర్శనానికి వెళ్లే భక్తులకు శంషాబాద్ ఎయిర్పోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు నుంచి హైదరాబాద్-అయోధ్య మధ్య విమాన సర్వీస్ నడిపేలా స్పైస్జెట్తో ఒప్పందం కుదుర్చుకుంది. SG611 విమానం రోజూ HYD నుంచి 10.45 గంటలకు బయలుదేరి 12.45 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. రిటర్న్ ఫ్లైట్ SG616 అయోధ్య నుంచి 13.25 గంటలకు బయలుదేరి 15.25 గంటలకు HYDకి వస్తుంది.
Similar News
News December 4, 2025
HYD: చెస్ ఆడతారా.. ₹22లక్షలు గెలుచుకోవచ్చు

తెలంగాణలో తొలి అతిపెద్ద ప్రైజ్మనీ చెస్ టోర్నమెంట్ డిసెంబర్ 20, 21 తేదీల్లో హిటెక్స్లో జరుగనుంది. ఎక్కారా చెస్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ ఓపెన్ ర్యాపిడ్ టోర్నమెంట్లో గెలుపొందితే ₹22.22 లక్షలు ప్రైజ్ మనీ సొంత చేసుకోవచ్చు. రాష్ట్రంలో భారీ స్థాయిలో జరుగుతున్న మొదటి చెస్ టోర్నీ అని నిర్వాహకులు తెలిపారు. SHARE IT
News December 4, 2025
రూపాయి.. ఇంకా కిందికి?

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ₹90ని క్రాస్ చేసింది. 2026 చివరి నాటికి ₹91.5కి చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. FIIలు తిరిగి ఇండియన్ మార్కెట్లో కొనుగోళ్లు చేపడితే డాలర్కు డిమాండ్ తగ్గి రూపాయి విలువ స్టెబిలైజ్ అవుతుందంటున్నారు. FIIల అమ్మకాలు కొనసాగితే మరింత <<18457079>>క్షీణిస్తుందని<<>> పేర్కొంటున్నారు. చమురు ధరలు పెరిగినా, భారత్-US మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యమైనా రూపీ పడిపోతుందని చెబుతున్నారు.
News December 4, 2025
ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఫేక్: పోలీసులు

TG: డిసెంబర్ 13న ట్రాఫిక్ చలాన్లపై 100% వరకు తగ్గింపు అంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ అని హైదరాబాద్ సిటీ పోలీసులు Xలో స్పష్టం చేశారు. ఇప్పటివరకు అలాంటి ప్రకటన ఏమీ చేయలేదని తెలిపారు. అనధికారిక సమాచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరారు. ఎల్లప్పుడూ పోలీస్ హ్యాండిల్స్ను చెక్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా పలు రాష్ట్రాల్లో అదే రోజున లోక్ అదాలత్ నిర్వహిస్తుండడంతో ఈ ప్రచారం జరిగినట్లు తెలుస్తోంది.


