News September 12, 2024

వరద పరిహారం.. 15 వేల మంది ఖాతాల్లో డబ్బులు జమ

image

TG: భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. ఖమ్మం జిల్లాలోని బాధితుల ఖాతాల్లోకి నిన్నటి నుంచి డబ్బులు జమ చేస్తోంది. ఇల్లు డ్యామేజ్ అయితే రూ.16,500, గుడిసెలు కూలితే రూ.18,000 ఇస్తోంది. నిన్న 15వేల మంది ఖాతాల్లోకి రూ.25కోట్లు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగతా వారికి ఇవాళ జమ అవుతాయని చెబుతున్నారు.

Similar News

News August 27, 2025

పండగ వేళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

image

వినాయక చవితి వేళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.380 పెరిగి రూ.1,02,440కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.350 ఎగబాకి రూ.93,900 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. KG సిల్వర్ రేట్ రూ.1,30,000గా ఉంది.

News August 27, 2025

తీవ్ర అల్పపీడనం.. బయటికి రావొద్దని హెచ్చరిక

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిందని APSDMA తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ప.గో, తూ.గో, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. వినాయక మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని పేర్కొంది.

News August 27, 2025

ఖైరతాబాద్ మహాగణపతి ముందే మహిళ ప్రసవం

image

TG: వినాయక చవితి రోజు ఖైరతాబాద్ మహా గణపతి వద్ద అద్భుతం చోటు చేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన నిండు గర్భిణి రేష్మ దర్శనం కోసం క్యూ లైన్‌లో నిల్చున్న సమయంలో పాపకు జన్మనిచ్చింది. గమనించిన సిబ్బంది పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తల్లీబిడ్డలను తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం వారిద్దరూ క్షేమంగా ఉన్నారు. గణనాథుడి ముందే పుట్టిన ఆ చిన్నారిది ఎంతో అదృష్టమని భక్తులు తెలిపారు.