News August 23, 2024
త్రిపురలో వరద బీభత్సం.. 17 లక్షలమందిపై ప్రభావం

గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా త్రిపుర వరదలతో అతలాకుతలమవుతోంది. ఇప్పటికే 19మంది మృతి చెందగా సుమారు 17 లక్షలమంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. గోమతి, దక్షిణ త్రిపుర, ఉనకోటి, పశ్చిమ త్రిపుర జిల్లాల్లో నష్టం అధికంగా ఉంది. భారత వాతావరణ శాఖ తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేయడంతో రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. జాతీయ విపత్తు స్పందన బలగాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.
Similar News
News January 20, 2026
350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 20, 2026
JAN 26 తర్వాత సాదా బైనామాలపై కొత్త రూల్స్!

TG: LRSలో పెండింగ్లో ఉన్న దాదాపు 9 L సాదా బైనామా అప్లికేషన్లను పరిష్కరించడానికి GOVT కొత్త రూల్స్ సిద్ధం చేస్తోంది. భూ భారతిలో సాంకేతిక సమస్యలు, దరఖాస్తుదారులు, భూ యజమానుల మధ్య వివాదాలతో వీటిని రూపొందిస్తోంది. అఫిడవిట్ల విధానాన్నీ మార్చనుంది. ఇవి JAN26 నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా దరఖాస్తుదారులకు హక్కులు కల్పిస్తే అధికారులపై కోర్టులకు వెళ్తామని యజమానులు హెచ్చరించడంతో తర్జనభర్జన పడుతున్నారు.
News January 20, 2026
బంగారం ఆల్ టైమ్ హై.. 10 గ్రా. రూ.1.52 లక్షలు

పసిడి పరుగులు ఆగడం లేదు. ఇవాళ మరోసారి పెరిగి ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రిటైల్ ధర ఏకంగా రూ.1,52,000 (3 శాతం జీఎస్టీతో కలిపి) దాటింది. సిల్వర్ కూడా రిటైల్ ధర కిలో రూ.3,39,900 (3% GSTతో కలిపి) పైనే పలుకుతోంది.


