News August 23, 2024

త్రిపురలో వరద బీభత్సం.. 17 లక్షలమందిపై ప్రభావం

image

గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా త్రిపుర వరదలతో అతలాకుతలమవుతోంది. ఇప్పటికే 19మంది మృతి చెందగా సుమారు 17 లక్షలమంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. గోమతి, దక్షిణ త్రిపుర, ఉనకోటి, పశ్చిమ త్రిపుర జిల్లాల్లో నష్టం అధికంగా ఉంది. భారత వాతావరణ శాఖ తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేయడంతో రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. జాతీయ విపత్తు స్పందన బలగాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.

Similar News

News November 17, 2025

సౌదీ బస్సు ప్రమాదం.. మృతుల వివరాలపై ఇంకా రాని స్పష్టత!

image

సౌదీ బస్సు <<18308554>>ప్రమాదంలో<<>> HYD వాసులు చనిపోయినట్లు వార్తలు రావడంతో యాత్రికుల బంధువులు ట్రావెల్ ఏజెన్సీల వద్దకు చేరుకుంటున్నారు. మల్లేపల్లిలోని అల్ మీనా ట్రావెల్స్ ద్వారా అసిఫ్‌నగర్ జిర్ర ప్రాంతం నుంచి 16మంది, మెహిదీపట్నం ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా 24మంది, మరో ఏజెన్సీ నుంచి ఇద్దరు సౌదీ వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై MP అసద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నామన్నారు.

News November 17, 2025

అముర్ ఫాల్కన్.. రోజుకు వెయ్యి కి.మీల ప్రయాణం

image

ప్రపంచంలోనే అత్యంత దూరం(22000 KM) వలస వెళ్లే పక్షుల్లో అముర్ ఫాల్కన్ జాతిది అగ్రస్థానం. సైబీరియా/ఉత్తర చైనా నుంచి వింటర్‌లో IND(ఈశాన్య రాష్ట్రాలు) మీదుగా ఆఫ్రికాకు ప్రయాణిస్తాయి. తాజాగా మణిపుర్ అముర్ ఫాల్కన్ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా 3 పక్షులకు శాటిలైట్ ట్యాగ్ చేశారు. వీటిలోని ఓ మగ పక్షి రోజుకు 1000KM చొప్పున 3 రోజుల్లోనే 3100KM వెళ్లినట్లు IAS సుప్రియ వెల్లడించారు. వీటి జర్నీ అద్భుతమన్నారు.

News November 17, 2025

జుట్టు జిడ్డు ఇలా తగ్గిద్దాం..

image

కాలుష్యం, దుమ్మూ తోడై కొందరి జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. దానికోసం ఈ చిట్కాలు.. * షాంపూలో స్పూన్ కలబంద, నిమ్మరసం చేర్చి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. * రెండు స్పూన్ల ముల్తానీమట్టిని పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. * తలస్నానం చేసిన జుట్టుకు బ్లాక్ టీని పట్టించి ఇరవైనిమిషాల తర్వాత కడిగేస్తే జిడ్డు తగ్గుతుంది.