News August 23, 2024
త్రిపురలో వరద బీభత్సం.. 17 లక్షలమందిపై ప్రభావం

గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా త్రిపుర వరదలతో అతలాకుతలమవుతోంది. ఇప్పటికే 19మంది మృతి చెందగా సుమారు 17 లక్షలమంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. గోమతి, దక్షిణ త్రిపుర, ఉనకోటి, పశ్చిమ త్రిపుర జిల్లాల్లో నష్టం అధికంగా ఉంది. భారత వాతావరణ శాఖ తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేయడంతో రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. జాతీయ విపత్తు స్పందన బలగాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.
Similar News
News January 25, 2026
బొప్పాయిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు.. నివారణ ఇలా

ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా ఆంత్రాక్నోస్ కారణంగా బొప్పాయి చెట్ల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి పెద్దవిగా మారి ఆకులకు రంధ్రాలు ఏర్పడి రాలిపోతాయి. వ్యాధి తీవ్రమైతే పండ్లు నాశనమవుతాయి. ఈ లక్షణాలు కనిపించిన ఆకులను ఏరివేసి నాశనం చేయాలి. చెట్ల మొదట్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2 గ్రా. కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా పిచికారీ చేయాలి.
News January 25, 2026
CMను కాపాడేందుకే భట్టి అవాస్తవాలు: హరీశ్ రావు

TG: సింగరేణి టెండర్లపై Dy.CM <<18943021>>భట్టి విక్రమార్క<<>> చెప్పినవన్నీ అవాస్తవాలని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. CM రేవంత్ను ‘స్కామ్’ నుంచి కాపాడేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో లేని సైట్ విజిట్ నిబంధనను తమ వారికి లబ్ధి చేకూర్చడానికే 2025లో తెచ్చారన్నారు. టెండర్ల ప్రక్రియలో నిపుణుల సంస్థలను పక్కన పెట్టి సింగరేణికి నష్టం కలిగించారని, లబ్ధిదారులెవరో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
News January 25, 2026
ICC నిర్ణయాన్ని గౌరవిస్తాం.. సవాలు చేయబోం: బంగ్లాదేశ్

T20 WC నుంచి తమను ICC తొలగించడంపై బంగ్లాదేశ్ అధికారికంగా స్పందించింది. <<18948168>>బోర్డు నిర్ణయాన్ని<<>> గౌరవిస్తున్నట్లు తెలిపింది. ‘మేం మా వంతు ప్రయత్నించాం. మ్యాచుల వేదికలు మార్చలేమని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాతా మా సొంత మార్గాల్లో ట్రై చేశాం. కానీ వాళ్లు సుముఖంగా లేకపోతే మేం మాత్రం ఏం చేయలేం. ఆ నిర్ణయాన్ని సవాలు చేయబోం’ అని BCB మీడియా కమిటీ ఛైర్మన్ అమ్జాద్ హుస్సేన్ చెప్పారు.


