News May 11, 2024
అఫ్గానిస్థాన్లో వరదలు.. 200 మంది మృతి

అఫ్గానిస్థాన్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దిగువ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తడంతో బఘ్లాన్ ప్రావిన్సులో దాదాపు 200 మంది చనిపోయినట్లు యూనిటెడ్ నేషన్స్ తెలిపింది. వేల సంఖ్యలలో ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొంది. దేశంలో చాలా చోట్ల మెరుపు వరదలు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అత్యవసర సిబ్బంది ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
Similar News
News February 13, 2025
రూ.500 ఇచ్చి ఫొటో పంపిస్తే.. కుంభమేళాలో స్నానం!

యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న ‘మహాకుంభమేళా’ను ఇప్పటికే 45 కోట్ల మంది భక్తులు సందర్శించారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చాలా మంది పాల్గొనలేకపోతున్నారు. అలాంటి వారిని ‘ముంచేందుకు’ కొందరు పథకం పన్నుతున్నారు. రూ.500 చెల్లించి ఫొటోలు వాట్సాప్ చేస్తే వాటిని త్రివేణి సంగమంలో ముంచుతామని, ఇలా చేస్తే మీరు స్నానం చేసినట్లేనని ఓ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
News February 13, 2025
చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లు!

AP: తూర్పు గోదావరిలో మరో ఘటన ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలోని చెరువుల్లో చేపలకు ఆహారంగా ఇస్తున్నారు. దీంతో చేపలు తినాలా? వద్దా? అని జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
News February 13, 2025
శ్రీలంక విద్యుత్ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్న అదానీ

శ్రీలంకలో తాము నిర్మించాల్సిన రెండు పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి తప్పుకొంటున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది. ఆ దేశంలో ఏర్పడిన కొత్త సర్కారు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని యోచిస్తోంది. అది తమకు అంతగా లాభించదన్న ఆలోచనతోనే అదానీ సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు విలువ బిలియన్ డాలర్ల వరకూ ఉండటం గమనార్హం.