News January 25, 2025

పొగమంచు వల్లే స్పిన్ ఆడటం కష్టమైంది: బ్రూక్

image

కోల్‌కతా‌లో జరిగిన తొలి T20లో ENG బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ఆడటంలో తడబడ్డారు. దీనికి పొగమంచే కారణమని ఆ జట్టు VC బ్రూక్ తెలిపారు. ‘చక్రవర్తి చాలా మంచి బౌలర్. పొగ మంచు వల్ల అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం మరింత కష్టమైంది. చెన్నైలో అలాంటి సమస్య ఉండదని అనుకుంటున్నా. T20 క్రికెట్‌లో అత్యంత కష్టతరమైనది స్పిన్ బౌలింగ్‌ను ఆడటమే. నేను మిడిలార్డర్‌లో వస్తాను కాబట్టి తొలి బంతి నుంచే స్పిన్‌ను ఆడాలి’ అని చెప్పారు.

Similar News

News February 19, 2025

CHAMPIONS TROPHY: 12 వేల మందితో భారీ భద్రత!

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పీసీబీ భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఇందులో 18 మంది సీనియర్ ఆఫీసర్లు, 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్‌స్పెక్టర్లు, 1,200 మంది అప్పర్ సబార్డినేట్‌లు, 10,556 మంది కానిస్టేబుళ్లను నియమించింది. అదనంగా 200 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు. అలాగే ఆటగాళ్లు, ప్రముఖుల కోసం 9 స్పెషల్ చార్టర్ ఫ్లైట్లను కూడా అందుబాటులో ఉంచింది. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ మధ్య ఇవి ప్రయాణిస్తాయి.

News February 19, 2025

శివాజీ జయంతికి రాహుల్ గాంధీ శ్రద్ధాంజలి..

image

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. జయంతి వేళ ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని రాయడమే ఇందుకు కారణం. సాధారణంగా వర్ధంతులకే ఇలా చెప్తుంటారు. మహారాష్ట్ర ఎన్నికల వేళ శివాజీ విగ్రహాలను తీసుకొనేందుకు ఆయన వెనుకాడటం, నిర్లక్ష్యం చేయడాన్ని కొందరు యూజర్లు గుర్తుచేస్తున్నారు.

News February 19, 2025

ఢిల్లీ CM ఎన్నిక: అబ్జర్వర్లను నియమించిన BJP

image

ఢిల్లీ CM అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. PM మోదీ నివాసంలో సమావేశమైన పార్లమెంటరీ ప్యానెల్ రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాశ్ ధన్‌ఖడ్‌ను అబ్జర్వర్లుగా నియమించింది. 7PMకు BJP MLAలు సమావేశం అవుతారు. అక్కడ వీరిద్దరూ ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. అంటే రాత్రి వరకు అభ్యర్థి ఎవరో తేలే అవకాశం లేదు. మరోవైపు DCC చీఫ్, కేజ్రీవాల్, ఆతిశీని ప్రమాణ స్వీకార వేడుకకు ఆహ్వానాలు పంపినట్టు తెలిసింది.

error: Content is protected !!