News September 2, 2024
డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ

AP: విజయవాడలో ఇరుకు ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చే విధానాన్ని కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు పరిశీలించారు. 8-10 కేజీల వరకు ఫుడ్, మెడిసిన్, నీటిని డ్రోన్ల ద్వారా సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎంత వీలుంటే అన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Similar News
News July 8, 2025
గోదావరికి వరద ఉద్ధృతి

AP: శబరి, సీలేరు వరదతో గోదావరి నదిలో ప్రవాహం పెరిగింది. పోలవరం ప్రాజెక్టు వద్ద 48 గేట్లు ఎత్తి 1.95 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. అటు ధవళేశ్వరం బ్యారేజీకి 2.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మహారాష్ట్రలో వర్షాలు మరింత ఊపందుకుంటాయని, 3-4 రోజుల్లో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
News July 8, 2025
ఈ లక్షణాలుంటే కఠిక పేదరికమే: చాణక్య నీతి

ఏ ఇంట్లో స్త్రీకి సముచిత స్థానం, తగిన మర్యాద దక్కదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని చాణక్య నీతి చెబుతోంది. అహంకారం, మోసం చేసే గుణాలున్న వారు మొదట లాభపడవచ్చు. కానీ, వారింట లక్ష్మి నిలవదు. పరిస్థితిని అంచనా వేయకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే వ్యాపారి, ఉద్యోగి ఇబ్బందులు పడక తప్పదు. అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం ఉండదని చాణక్య నీతిలో ఉంది.
News July 8, 2025
రాష్ట్రంలో రానున్న 3 రోజులు వర్షాలు

AP: పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోందని IMD తెలిపింది. దీనికి అనుగుణంగా ద్రోణి కూడా కొనసాగుతోంది. రానున్న రెండ్రోజుల్లో అల్పపీడనం ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్వైపు కదులుతుంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది.