News March 5, 2025

తల్లికిచ్చిన మాట కోసం 26 ఏళ్లుగా!

image

అనారోగ్యంతో చనిపోయిన తన తల్లికిచ్చిన వాగ్దానం మేరకు డా.నాగేంద్ర శర్మ (రాజస్థాన్) 26 ఏళ్లుగా ఉచితంగా మూర్ఛ రోగులకు చికిత్స అందిస్తున్నారు. వైద్యం చేయించుకోలేక చనిపోయిన తన తల్లిలా మరెవరికీ జరగకూడదని నిర్ణయించుకున్నారు. ఈయన 1987లో వైద్య విద్య పూర్తి చేశారు. మూఢ నమ్మకాలతో మూర్ఛ రోగులు చనిపోకూడదని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇన్నేళ్లుగా 80వేల మందికి పునర్జన్మనిచ్చిన శర్మను అభినందించాల్సిందే.

Similar News

News December 9, 2025

HURLలో అప్రెంటిస్ పోస్టులు

image

హిందుస్థాన్ ఉర్వరిక్ రసాయన్ లిమిటెడ్ (<>HURL<<>>) 33 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెక్నికల్ అప్రెంటిస్‌కు డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు BE, B.Tech, B.Com, BBA, BSc ఉత్తీర్ణులు DEC 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. అప్రెంటిస్‌లు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: hurl.net.in

News December 9, 2025

ఇండియాస్ హాకీ విలేజ్ గురించి తెలుసా?

image

14 మంది ఒలింపియన్లు సహా 300 మంది హాకీ ప్లేయర్లను ఇచ్చింది పంజాబ్ జలంధర్ దగ్గరలోని సన్సర్‌పూర్. హాకీని సంస్కృతిగా చూశారు గనుకే ఒక ఒలింపిక్స్‌లో ఐదుగురు ఇండియాకు, ఇద్దరు హాకీ ప్లేయర్లు కెన్యాకు ఆడారు. హాకీనే ఊపిరిగా తీసుకున్న ఆ గ్రామ వైభవాన్ని వసతుల లేమి, వలసలు మసకబార్చాయి. టర్ఫ్ గ్రౌండ్స్, అకాడమీలు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటుతో సన్సర్‌పూర్‌కు పునర్వైభవం తేవడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.

News December 9, 2025

పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే $3T ఎకానమీ సాధ్యం: భట్టి

image

TG: తెలంగాణ రైజింగ్ కోసం తమ ప్రభుత్వం నియంత్రించేదిగా కాకుండా ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘TG ఇన్నోవేషన్ క్యాపిటల్ కావాలంటే ‘ఈజ్ ఆఫ్ ఇన్నోవేటింగ్’ వైపు సాగాలి. ఉత్పాదకత పెంపే తెలంగాణ సాధారణ పౌరుడి వేతనాలు, గౌరవాన్ని శాశ్వతంగా పెంచే ఏకైక మార్గం. ‘తెలంగాణ రైజింగ్ 2047’ పత్రం కాదు ప్రతిజ్ఞ’’ అని వివరించారు. పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే $3T ఎకానమీ సాధ్యమన్నారు.