News September 13, 2024

భారత్‌లో మళ్లీ ఉత్పత్తి ప్రారంభించనున్న ఫోర్డ్

image

కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ 1995 నుంచి భారత్‌లోని చెన్నై, గుజరాత్‌లో కార్లను తయారుచేసేది. అమ్మకాలు పడిపోవడంతో 2021 సెప్టెంబరులో ఉత్పత్తి ఆపేసింది. అయితే ఇప్పుడు చెన్నైలో మళ్లీ ఉత్పత్తిని ప్రారంభించాలని నిర్ణయించింది. ఆ వాహనాలను విదేశాలకు ఎగుమతి చేస్తామని తెలిపింది. మరి భారత మార్కెట్ కోసం కూడా కార్లను ఉత్పత్తి చేస్తుందా లేదా అన్నదానిపై సంస్థ స్పష్టతనివ్వలేదు.

Similar News

News October 24, 2025

సూపర్ ఫిట్‌గా శర్వానంద్

image

టాలీవుడ్ హీరో శర్వానంద్ కొత్త లుక్‌లో అదరగొడుతున్నారు. సన్నగా మారిపోయి, సడన్‌గా చూస్తే గుర్తుపట్టలేనంతగా ట్రాన్స్‌ఫామ్ అయ్యారు. శర్వానంద్ ప్రస్తుతం ‘బైకర్’ అనే స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ మూవీలో నటిస్తుండగా, సినిమాలో పాత్ర కోసం సిక్స్ ప్యాక్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కాస్త బొద్దుగా ఉన్న ఆయన సూపర్ ఫిట్‌గా మారిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. శర్వానంద్ కొత్త లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.

News October 24, 2025

సమస్యలను దూరం చేసే వాస్తు దిక్కును ఎలా ఎంచుకోవాలి?

image

ఇల్లు కట్టుకునేటప్పుడు/కొనేటప్పుడు ఆ ఇంటి దిక్కు మనకు మంచి చేస్తుందా లేదా అని చూసుకోవడం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. జన్మరాశి ఆధారంగా మన ఇంటికి ఏ దిక్కు అనుకూలమో ముందే తెలుసుకోవచ్చని సూచించారు. ‘జన్మ రాశి, నక్షత్రం తెలియకపోయినా, పేరు బలాన్ని ఉపయోగించి ఏ దిక్కు శుభప్రదమో తెలుసుకోవచ్చు. వాస్తు విషయంలో దిక్కుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి’ అని అన్నారు. <<-se>>#Vasthu<<>>

News October 24, 2025

న్యూస్ అప్డేట్స్

image

➤ J&Kలో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు రిలీజ్. 3 స్థానాల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్, క్రాస్‌ ఓటింగ్‌తో ఒక స్థానంలో BJP గెలుపు
➤ బిహార్‌లో BJP-JDU కూటమి CM అభ్యర్థి నితీశ్ కుమార్ అని స్పష్టం చేసిన PM మోదీ.
➤ AP: తిరుపతిలోని స్వర్ణముఖి నదిలో నలుగురు యువకులు గల్లంతు. ఒకరి మృతదేహం లభ్యం.
➤ TG: జూబ్లీహిల్స్ తుది ఓటర్ లిస్ట్ రిలీజ్. మొత్తం 4,01,365 మంది ఓటర్లు.