News February 10, 2025
6 నెలల్లో అటవీశాఖలో పోస్టుల భర్తీ

AP: అటవీ శాఖలోని ఖాళీలను వచ్చే 6 నెలల్లో భర్తీ చేయనున్నామని ఆ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి తెలిపారు. APPSC ద్వారా రేంజి, సెక్షన్, బీట్ అధికారుల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అలాగే, రాష్ట్రంలో 50చోట్ల రూ.50కోట్లతో ఎకో టూరిజం డెవలప్ చేసి 4వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అటవీ శాఖ పట్టుకున్న 905MT ఎర్రచందనాన్ని త్వరలో విక్రయిస్తామని, రూ.350cr ఆదాయం వస్తుందని వివరించారు.
Similar News
News November 21, 2025
పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.
News November 21, 2025
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 4 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MA (ELS/ELT/ఇంగ్లిష్), PhD, M.Phil ఉత్తీర్ణతతో పాటు NET అర్హత సాధించి ఉండాలి. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 26వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://uohyd.ac.in/
News November 21, 2025
VIRAL: సముద్రంలో ఒంటరిగా 483 రోజులు!

సముద్రంలో ఒంటరిగా ఒక్క రోజు గడపడమే గగనం. అలాంటిది జోస్ సాల్వడార్ అనే మత్స్యకారుడు 483 రోజులు ఒంటరిగా గడిపిన ఘటనను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. 2012లో మెక్సికో తీరం నుంచి పడవలో బయలుదేరిన ఆయన తుఫానులో చిక్కుకుని 438 రోజులు పసిఫిక్ మహాసముద్రంలో గడిపారు. పచ్చి చేపలు, పక్షులు, వర్షపు నీరును తాగుతూ మనుగడ సాగించారు. బతకాలనే ఆశ బలంగా ఉంటే, ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చని ఆయన నిరూపించారు.


