News February 10, 2025
6 నెలల్లో అటవీశాఖలో పోస్టుల భర్తీ

AP: అటవీ శాఖలోని ఖాళీలను వచ్చే 6 నెలల్లో భర్తీ చేయనున్నామని ఆ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి తెలిపారు. APPSC ద్వారా రేంజి, సెక్షన్, బీట్ అధికారుల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అలాగే, రాష్ట్రంలో 50చోట్ల రూ.50కోట్లతో ఎకో టూరిజం డెవలప్ చేసి 4వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అటవీ శాఖ పట్టుకున్న 905MT ఎర్రచందనాన్ని త్వరలో విక్రయిస్తామని, రూ.350cr ఆదాయం వస్తుందని వివరించారు.
Similar News
News March 25, 2025
మహిళలకు తగ్గిన లీడర్షిప్ పొజిషన్లు: టీమ్లీజ్

హయ్యర్ లీడర్షిప్ స్థాయుల్లో మహిళల ప్రాతినిధ్యం సగటున 19%కి తగ్గినట్టు టీమ్లీజ్ రిపోర్టు తెలిపింది. ఎంట్రీ లెవల్ పొజిషన్లలో 46% ఉన్నట్టు పేర్కొంది. ఇక వారి నిరుద్యోగ రేటు 2.9 నుంచి 3.2%కి పెరిగిందని వెల్లడించింది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ బాగుందంది. కన్జూమర్ సర్వీసెస్, రిటైల్, విద్య వంటి రంగాల్లో వారికి సీ-సూట్ పొజిషన్లు ఎక్కువగా దక్కుతున్నాయి.
News March 25, 2025
హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్ల కీలక నిర్ణయం

TG: హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్నిప్రమాదాలు, వరద ముంపు నివారణకు రెండు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు చెరువుల సంరక్షణ, సుందరీకరణ, పునరుద్ధరణపై చర్చించారు.
News March 25, 2025
50వేల మంది విద్యార్థులకు ‘సిస్కో’ శిక్షణ: లోకేశ్

AP: ఉన్నత, వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు IT సంస్థ సిస్కోతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. ‘నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, AI వంటి రంగాల్లో అత్యాధునిక కంటెంట్ను సిస్కో అందిస్తుంది. ఈ MoUతో 50K మందికి ఆ సంస్థ శిక్షణ ఇస్తుంది. మానవ వనరులకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నైపుణ్యాలను పెంచి, ఉపాధిని పెంపొందించడమే లక్ష్యం’ అని ట్వీట్ చేశారు.