News August 9, 2024

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు

image

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం జేపీసీ(జాయింట్ పార్లమెంటరీ కమిటీ) ఏర్పాటు చేసింది. మొత్తం 21 మంది లోక్‌సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో తెలంగాణ నుంచి డీకే అరుణ, అసదుద్దీన్ ఒవైసీకి, ఏపీ నుంచి లావు కృష్ణ దేవరాయలుకి చోటు దక్కింది. జేపీసీలో సభ్యులు కాబోయే రాజ్యసభ ఎంపీల పేర్లను త్వరలోనే ప్రకటించనున్నారు

Similar News

News October 29, 2025

మరింత కష్టపడి మీ నోరు మూయిస్తా: అభిషేక్

image

అవార్డు కొనుక్కున్నానంటూ వచ్చిన కామెంట్లపై నటుడు అభిషేక్ బచ్చన్ తనదైన శైలిలో స్పందించారు. ‘అవార్డుకోసం పీఆర్‌ మేనేజ్ చేయలేదు. కష్టంతో కన్నీళ్లు ఒలికించి, రక్తం చిందించి సాధించాను. మీరు ఇకపైనా నమ్ముతారనుకోను. అందుకే మరో విజయం కోసం మరింత కష్టపడి మీ నోరు మూయిస్తా’ అని Xలో ఆయన పేర్కొన్నారు. కాగా ‘ఐ వాంట్ టు టాక్’ మూవీలో ఆయన నటనకు ఫిలింఫేర్-2025 అవార్డు దక్కగా దాన్ని కొన్నారని SMలో విమర్శలొచ్చాయి.

News October 29, 2025

రేపు కాలేజీల బంద్‌: SFI

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత, ప్రొఫెషనల్ విద్యాసంస్థలు, యూనివర్సిటీల బంద్‌కు <<18122140>>SFI<<>> పిలుపునిచ్చింది. దీంతో పలు కాలేజీలు రేపు సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షాల నేపథ్యంలో సిద్దిపేట, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని స్కూళ్లకు రేపు హాలిడే ఇచ్చారు.

News October 29, 2025

రష్యా దూకుడు.. ఈ సారి అండర్ వాటర్ డ్రోన్ ప్రయోగం

image

అణుశక్తితో నడిచే మరో ఆయుధాన్ని రష్యా ప్రయోగించింది. అండర్ వాటర్ డ్రోన్ ‘Poseidon’ను టెస్ట్ చేసినట్లు ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఇది న్యూక్లియర్ పవర్ యూనిట్ అమర్చిన మానవరహిత వెహికల్ అని తెలిపారు. ఆ డ్రోన్‌ను ఇంటర్‌సెప్ట్ చేసే మార్గమే లేదని చెప్పారు. వారం రోజుల వ్యవధిలో రష్యా నిర్వహించిన రెండో పరీక్ష ఇది. ఇటీవల న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ <<18109096>>మిసైల్‌ <<>>Burevestnikను ప్రయోగించడం తెలిసిందే.