News February 16, 2025
మారిషస్ మాజీ ప్రధాని జగన్నాథ్ అరెస్ట్

మనీ లాండరింగ్ కేసులో మారిషస్ మాజీ PM ప్రవింద్ జగన్నాథ్(63)ను ఆ దేశ ఆర్థిక నేరాల కమిషన్ అరెస్ట్ చేసింది. ఆయన నివాసంలో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, లగ్జరీ వాచ్లు, నగదును స్వాధీనం చేసుకుంది. ప్రవింద్ 2017-24 మధ్య PMగా పనిచేశారు. ఆయన చేసుకున్న కొన్ని ఒప్పందాల్లో స్కామ్స్ జరిగాయని, వాటిపై ఆడిట్ నిర్వహిస్తామని కొత్త ప్రధాని నవీన్ రామ్ అప్పట్లో ప్రకటించారు. అన్నట్లుగానే చర్యలు తీసుకున్నారు.
Similar News
News October 28, 2025
లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత

TG: మల్లోజుల, ఆశన్న బాటలోనే మావోయిస్టు కీలక నేత లొంగిపోయారు. 45 ఏళ్లు అజ్ఞాతంలో ఉన్న రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ ఇవాళ DGP శివధర్ రెడ్డి ఎదుట సరెండర్ అయ్యారు. మంచిర్యాల(D) మందమర్రికి చెందిన ఆయన సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ 1980లో పీపుల్స్ వార్ ఉద్యమాలకు ఆకర్షితుడయ్యారు. 1984లో AITUC నేత అబ్రహం హత్య కేసులో అరెస్టై ADB సబ్ జైలు నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు.
News October 28, 2025
తుఫాన్ బాధితుల్ని ఆదుకునే తీరు ఇదేనా: YCP

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కనిపించట్లేదని YCP ఆరోపిస్తోంది. ‘మంత్రి కందుల దుర్గేశ్ నియోజకవర్గంలోనే పునరావాస కేంద్రాలు కనిపించట్లేదు. కలెక్టర్ ఆదేశాలిచ్చినా అధికారులు కనీసం పట్టించుకోవట్లేదు. తుఫాన్ బాధితుల్ని ఆదుకునే తీరు ఇదేనా? విజయనగరం జిల్లా గుర్లలో తుఫానుతో వరి పంట నేలకొరిగింది. రైతుల్ని పరామర్శించడం కాదు కదా.. కనీసం కూటమి నేతలు పట్టించుకోవట్లేదు’ అని ట్వీట్ చేసింది.
News October 28, 2025
వరదల సమయం.. పాడి పశువుల సంరక్షణకు సూచనలు

భారీ తుఫానులు, వరదలు సంభవించినప్పుడు రైతులు తమ ప్రాణాలను, ఆస్తులను కాపాడుకునే ప్రయత్నంలో, పశువులను అలాగే కట్టేసి వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతారు. అవి వరద నీరు వల్ల ఎటూ వెళ్లలేని స్థితిలో ప్రాణాలు కోల్పోతాయి. అందుకే వరదల సమయంలో పశువులను పాకల్లో కట్టకుండా వదిలేయాలి. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా పశువులను ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. వాటికి కొంత మేతను అందించాలి.


