News September 21, 2024
మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ మృతి

AP: మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ (72) మరణించారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. రేపు విజయవాడలోని మొగల్రాజపురంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. 1983లో టీడీపీ తరఫున విజయవాడ తూర్పు నుంచి జయప్రకాశ్ ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్కు అత్యంత సన్నిహితులు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించారు.
Similar News
News January 16, 2026
కనుమ రోజున పశువులను ఎలా పూజించాలి?

పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటేనే రైతుకి ఉత్సాహం. పంట చేతికి రావడంలో వాటి పాత్ర కీలకం. తమకు సుఖ,సంతోషాలను అందించడానికి అహర్నిశలు కష్టపడే పశువులను రైతులు మరచిపోరు. తమకు జీవనాధారమైన మూగజీవాల పట్ల కృతజ్ఞతగా అన్నదాతలు ‘కనుమ’ రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. ఈ రోజు పశువులను ఎలా పూజిస్తే వ్యవసాయం మరింత సుభిక్షంగా ఉంటుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ <<>>క్లిక్ చేయండి.
News January 16, 2026
T20 వరల్డ్కప్లో సుందర్ ఆడటం కష్టమే!

టీమ్ ఇండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి ఇప్పటికీ కోలుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే న్యూజిలాండ్తో చివరి రెండు వన్డేలకు దూరమైన సుందర్, ఇప్పుడు టీ20లకూ అందుబాటులో లేరు. ఈ విషయాన్ని ఇటీవల బీసీసీఐ తెలిపింది. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే T20 వరల్డ్కప్కు కూడా పూర్తి ఫిట్నెస్ సాధించడం కష్టమని నివేదికలు చెబుతున్నాయి. దీంతో జట్టులో ఆయన స్థానం అనుమానంగానే మారింది.
News January 16, 2026
గ్రీన్లాండ్కు భారీగా యూరోపియన్ సైనిక బలగాలు

గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని US అధ్యక్షుడు ట్రంప్ <<18784880>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో యూరోపియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. డెన్మార్క్కు మద్దతుగా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నార్వే సహా పలు దేశాలు గ్రీన్లాండ్కు సైనిక బలగాలను పంపుతున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్ సైనికులు గ్రీన్లాండ్ రాజధాని నూక్ చేరుకోగా, జర్మనీ సైతం సైనిక బృందాన్ని మోహరించింది. నాటో దేశాల ఐక్యతను చూపించేందుకే ఈ బలగాల మోహరింపు అని సమాచారం.


