News March 2, 2025
టీమ్ ఇండియాకు పాక్ మాజీ ప్లేయర్ సవాల్

టీమ్ ఇండియా బాగా ఆడేది నిజమైతే పాకిస్థాన్తో 10 టెస్టులు, 10 వన్డేలు, 10 T20లు ఆడాలని ఆ జట్టు మాజీ ప్లేయర్ సక్లైన్ ముస్తాక్ సవాల్ విసిరారు. అప్పుడే ఏది బెస్ట్ టీమ్ అనేది తెలుస్తుందని చెప్పారు. ఇదే జరిగితే ఇండియాకు, ప్రపంచ క్రికెట్కు తాము తగిన సమాధానం చెప్పిన వాళ్లమవుతామన్నారు. కాగా భారత్, పాక్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహించట్లేదు.
Similar News
News March 20, 2025
గన్ లైసెన్స్ ఇవ్వండి: రాజాసింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని బుల్లెట్ ప్రూప్ వెహికిల్, సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్లొద్దని సూచించారు. అయితే గోషామహల్ నియోజకవర్గంలో ఇరుకైన రోడ్లు ఉంటాయని అందులో బుల్లెట్ ప్రూప్ వెహికిల్ తిరగలేదని రాజాసింగ్ అన్నారు. భద్రత కోసం తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే పోలీసులను కోరారు.
News March 20, 2025
తను నిజమైన వర్కింగ్ ఉమెన్: ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రాకు జరిగిన ఒక ఆసక్తికర సంఘటనని ఇన్స్టాలో షేర్ చేశారు. తను వైజాగ్ ఎయిర్ పోర్ట్ వెళ్తున్న సమయంలో రోడ్డుపై తనకెంతో ఇష్టమైన జామ పండ్లు కనిపించాయట వాటి ఖరీదు రూ.150 అయితే ప్రియాంక రూ.200 ఇచ్చి ఉంచుకోమని చెప్పిందట, అప్పుడు పండ్లు అమ్మె మహిళ మిగిలిన డబ్బులకు సరిపడేలా కొన్ని పండ్లు ఇచ్చి వెళ్లిందట. తను నిజమైన వర్కింగ్ ఉమెన్ అని నా మనసు గెలిచిందని ప్రియాంక ఇన్స్టాలో షేర్ చేశారు.
News March 20, 2025
కుంభమేళాలో 1,000 మంది భక్తుల మిస్సింగ్: అఖిలేశ్ యాదవ్

ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళాలో మిస్సయిన 1,000మంది భక్తుల జాడ కనుక్కోవడంలో ఉత్తరప్రదేశ్ సర్కార్ విఫలమైందని ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో తప్పిపోయిన వారి పోస్టర్లు ఉన్నాయన్నారు. యూపీ, MP ప్రభుత్వాలు కలిసి వెహికిల్ పార్కింగ్ ఏర్పాట్లు మాత్రమే చేశాయని దుయ్యబట్టారు. కుంభమేళా ఏర్పాట్లకు కేంద్రం ఎన్ని నిధులు కేటాయించిందో తెలపాలని అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.