News June 5, 2024

ఒకే నియోజకవర్గం నుంచి నలుగురు MLAలు!

image

AP: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గానికి చెందిన నలుగురు MLAలుగా ఎన్నికయ్యారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దామచర్ల జనార్దన్ (ఒంగోలు), డీబీవీ స్వామి (కొండపి), ఎంఎం కొండయ్య (చీరాల), గంటా శ్రీనివాస్ (భీమిలి) ఈ నియోజకవర్గానికి చెందినవారే. అలాగే ఒంగోలులో ఓడిన YCP అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్ది, కందుకూరులో ఓడిన YCP అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా ఇదే సెగ్మెంట్‌కు చెందినవారు.

Similar News

News February 6, 2026

U19 WC ఫైనల్.. టాస్ గెలిచిన భారత్

image

హరారే వేదికగా ENGతో జరుగుతోన్న U19 ODI WC ఫైనల్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సేమ్ టీమ్‌తో ఆడుతున్నామని, ఈ బ్యాటింగ్ పిచ్‌లో మంచి టార్గెట్ సెట్ చేయాలనుకుంటున్నట్లు కెప్టెన్ ఆయుష్ మాత్రే తెలిపారు.

IND: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే(C), విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(w), వేదాంత్ త్రివేది, అంబరీశ్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్

News February 6, 2026

కాంగ్రెస్‌ బాధపడినా సరే మోదీకి థాంక్స్ చెబుతా: ఒమర్‌

image

J&Kకు కేంద్రం మంచి చేసినప్పుడల్లా PM మోదీకి బహిరంగంగానే థాంక్స్ చెబుతానని CM ఒమర్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు. అలా చేయడం వల్ల కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా పట్టించుకోనన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. J&Kలో కాంగ్రెస్, ఒమర్ పార్టీ JKNC మిత్రపక్షాలుగా ఉన్న సంగతి తెలిసిందే.

News February 6, 2026

రేపు ర్యాపిడో, ఉబర్, ఓలా డ్రైవర్ల సమ్మె

image

ర్యాపిడో, ఉబర్, ఓలా, పోర్టర్, అంకుల్, మూవర్‌ డ్రైవర్లు రేపు దేశవ్యాప్తంగా బంద్ పాటించనున్నారు. 6AM-12PM మధ్య సమ్మె కొనసాగనుంది. దీంతో HYD సహా ప్రధాన నగరాల్లో సర్వీసులకు అంతరాయం ఏర్పడనుంది. మినిమమ్ ఫేర్ వల్ల ఆదాయం తగ్గుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రిగేటర్ కంపెనీల తీరుతో దోపిడీకి గురవుతున్నామని చెబుతున్నారు. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.