News June 5, 2024
ఒకే నియోజకవర్గం నుంచి నలుగురు MLAలు!

AP: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గానికి చెందిన నలుగురు MLAలుగా ఎన్నికయ్యారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దామచర్ల జనార్దన్ (ఒంగోలు), డీబీవీ స్వామి (కొండపి), ఎంఎం కొండయ్య (చీరాల), గంటా శ్రీనివాస్ (భీమిలి) ఈ నియోజకవర్గానికి చెందినవారే. అలాగే ఒంగోలులో ఓడిన YCP అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్ది, కందుకూరులో ఓడిన YCP అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా ఇదే సెగ్మెంట్కు చెందినవారు.
Similar News
News January 21, 2026
సీఎంల దావోస్ పర్యటన.. డబ్బు వృథానే: రాజీవ్ శుక్లా

సీఎంల దావోస్(Swiz) పర్యటనపై రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా అసహనం వ్యక్తం చేశారు. ‘భారతీయులు వెళ్లి భారతీయులనే కలుస్తున్నారు. దేశీయ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నారు. భారత్లోనే ఈ అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాలు స్విట్జర్లాండ్ వెళ్లి అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. ఇదంతా డబ్బు వృథానే. అక్కడికి వెళ్లినప్పుడు విదేశీ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే కాస్త ప్రయోజనకరం’ అని Xలో రాసుకొచ్చారు. దీనిపై మీ COMMENT?
News January 21, 2026
9 మంది కూతుళ్ల తర్వాత కొడుకు.. మళ్లీ అక్కడే!

ఆడ పిల్లలున్నా మగ సంతానం కోసం ఎంతదూరమైనా వెళ్తున్నారు కొందరు దంపతులు. హరియాణాలోని జింద్(D)లో 10వ ప్రసవంలో కొడుక్కి జన్మనిచ్చిందో మహిళ. ఉచానా కలాన్లో సురేంద్ర, రీతుకు ఇప్పటికే 9 మంది కూతుళ్లు ఉండటం గమనార్హం. అమ్మాయిలకు కాఫీ(ఇక చాలు), మాఫీ(క్షమాపణ) పేర్లు పెట్టామని, ఇక తమకు పిల్లలు చాలని రీతు చెప్పారు. ఇటీవల ఉచానాలోనే 10 మంది <<18796058>>ఆడపిల్లలున్న మహిళ<<>> 11వ సారి గర్భం దాల్చి కొడుకుకు జన్మనివ్వడం తెలిసిందే.
News January 21, 2026
విశాఖలో కాగ్నిజెంట్ పనులు వేగవంతం చేయండి: లోకేశ్

AP: విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ పనులను వేగవంతం చేయాలని మంత్రి లోకేశ్ ఆ కంపెనీ CEO రవికుమార్ సింగిశెట్టిని కోరారు. దావోస్లో ఆయనతో భేటీ అయిన లోకేశ్.. తాత్కాలిక సౌకర్యాల ద్వారా ఉద్యోగుల సంఖ్యను పెంచే అంశాన్ని పరిశీలించాలన్నారు. Ai, క్లౌడ్, డేటా, డిజిటల్ ఇంజినీరింగ్, CTS నియామక అవసరాలకు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో డెడికేటెడ్ సెంట్రలైజ్డ్ స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరారు.


