News June 5, 2024
ఒకే నియోజకవర్గం నుంచి నలుగురు MLAలు!

AP: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గానికి చెందిన నలుగురు MLAలుగా ఎన్నికయ్యారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దామచర్ల జనార్దన్ (ఒంగోలు), డీబీవీ స్వామి (కొండపి), ఎంఎం కొండయ్య (చీరాల), గంటా శ్రీనివాస్ (భీమిలి) ఈ నియోజకవర్గానికి చెందినవారే. అలాగే ఒంగోలులో ఓడిన YCP అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్ది, కందుకూరులో ఓడిన YCP అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా ఇదే సెగ్మెంట్కు చెందినవారు.
Similar News
News February 10, 2026
బరువు ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే..

ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేస్తూ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని అలవాట్లను పాటిస్తే బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చంటున్నారు నిపుణులు. రాత్రి 8 తర్వాత ఆహారం తీసుకోకూడదు. ఆలస్యంగా, ఎక్కువ మోతాదులో తినడంతో జీవక్రియలకు అంతరాయం కలుగుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్, నూడిల్స్, వేపుళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి.
News February 10, 2026
న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?

T20WC: న్యూజిలాండ్పై UAE జట్టు విజృంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 20 ఓవర్లలో 173/6 రన్స్ చేసింది. వసీమ్(66*) అలిషాన్(55), మయాంక్ కుమార్(21) చెలరేగారు. మిగిలిన వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేదు. 18వ ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ 27 రన్స్ సమర్పించుకున్నారు. కివీస్ బౌలర్లలో హెన్రీ 2, డఫ్పీ, ఫిలిప్స్, శాంట్నర్, ఫెర్గ్యూసన్ తలో వికెట్ దక్కింది. విజయం కోసం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 174 రన్స్ చేయాలి.
News February 10, 2026
త్వరలో రాష్ట్రంలో 15,247 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

TG: త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 15,247 అంగన్వాడీ కార్యకర్త, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందుకోసం మహిళా శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయగానే భర్తీ ప్రక్రియ ప్రారంభించనున్నారు. టెన్త్, ఇంటర్ అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.


