News August 14, 2025

DSC స్పోర్ట్స్ కోటా పోస్టుల పేరుతో మోసం.. జాగ్రత్త!

image

AP: స్పోర్ట్స్ కోటా కింద ఎలాంటి పరీక్ష లేకుండా నేరుగా 421 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం 5,326 అప్లికేషన్స్ రాగా, 1200 మంది 1:5 రేషియోలో షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ క్రమంలో శాప్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామంటూ అభ్యర్థులను డబ్బులు అడుగుతున్నారని జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పందించారు. శాప్ నుంచి అలా ఎవరూ కాల్ చేసి డబ్బులు అడగలేదని స్పష్టం చేశారు. ఆశపడి డబ్బులు పంపి మోసపోవద్దని సూచించారు.

Similar News

News August 14, 2025

అలాగైతే భారత్‌పై మరింత టారిఫ్స్: US హెచ్చరిక

image

భారత్‌పై టారిఫ్స్‌ను US మరింత పెంచవచ్చని ఆ దేశ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ హెచ్చరించారు. అలస్కాలో శుక్రవారం జరిగే ట్రంప్-పుతిన్ భేటీ రిజల్ట్‌పై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అంగీకరిస్తే టారిఫ్స్ పెంపు ఉండకపోవచ్చని, లేదంటే సుంకాలు పెంపు తప్పదన్నారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటోందని ఇప్పటికే INDపై US 25% అదనపు టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే.

News August 14, 2025

నీటి నిర్వహణపై జిల్లాలకు రేటింగ్: సీఎం

image

AP: నీటివనరుల సంరక్షణతోనే భూగర్భ జలాలు పెరుగుతాయని CM CBN అన్నారు. సమర్థ నీటి నిర్వహణతో కరవును తరిమేయవచ్చని చెప్పారు. సాగునీటిశాఖలో ఇంజినీరింగ్ వ్యవస్థను రీస్ట్రక్చర్ చేస్తామని తెలిపారు. నీటి నిర్వహణలో సాగునీటి సంఘాల భాగస్వామ్యం ఉండాలని ఆ శాఖ సమీక్షలో CM అన్నారు. నీటి నిర్వహణపై జిల్లాలకు రేటింగ్ ఇస్తామని తెలిపారు. వెలిగొండ, గాలేరు నగరి సుజల స్రవంతిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

News August 14, 2025

SC తీర్పు ప్రజాస్వామ్య విజయం: మహేశ్ కుమార్

image

TG: బిహార్‌లో ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు <<17403517>>తీర్పు<<>> ప్రజాస్వామ్య విజయమని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. LoP రాహుల్ లేవనెత్తిన ఓటు చోరీ ఆరోపణ ఈ తీర్పుతో రుజువైందన్నారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చకు పట్టుబట్టినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ఆధార్ లింక్‌తో ‘ఒక ఓటు-ఒక మనిషి’ విధానం అమలు చేయాలన్న రాహుల్ డిమాండ్‌పై EC స్పందించాలని డిమాండ్ చేశారు.