News August 27, 2024

ఫ్రీ బస్ ఎఫెక్ట్.. 64 శాతం ప్రయాణికులు వారే

image

TG: మహాలక్ష్మి పథకం అమలుతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతి ముగ్గురిలో ఇద్దరు స్త్రీలే ఉంటున్నారు. DEC 9 నుంచి ఈ నెల 19 వరకు 122 కోట్ల మంది ప్రయాణించగా, వారిలో 79 కోట్ల మంది(64.47%) మహాలక్ష్ములే. హనుమకొండ సిటీ బస్సుల్లో ఏకంగా 82% మంది మహిళలే ఉన్నారు. రీజియన్ల వారీగా చూస్తే GHMC(67.45%) తొలి స్థానంలో ఉండగా, తర్వాత కరీంనగర్(67.37%), నిజామాబాద్(65.17%), మెదక్(64.67%) ఉన్నాయి.

Similar News

News February 26, 2026

ఏప్రిల్ నుంచి కొత్త పెట్రోల్ రూల్

image

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) సేల్స్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇంజిన్ పనితీరు దెబ్బతినకుండా ఉండేందుకు కనీసం 95 రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ (RON) ఉండాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించింది. దీనివల్ల కాలుష్యం 30% వరకు తగ్గడమే కాకుండా రైతులకు మేలు జరుగుతుంది. అయితే పాత వాహనాల్లో మైలేజీ 3-7% తగ్గే అవకాశం ఉంది. 2023 తర్వాత తయారైన వాహనాలకు ఈ ఇంధనం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

News February 26, 2026

నేడు పిడుగులతో కూడిన వర్షాలు

image

AP, TGలో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వానలు కురుస్తున్నాయి. వేసవిలో కురిసే రుతుపవన ముందస్తు వర్షాలు ఈసారి ముందుగానే పడ్డాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ద్రోణి ప్రభావంతో ఇవాళ APలోని శ్రీకాకుళం, ఉ.గో, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని IMD వెల్లడించింది. TGలోని రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

News February 26, 2026

బ్రహ్మాస్త్రం తయారీ.. ఎలా ఉపయోగించాలి?

image

వేప, సీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త ఆకులను మెత్తగానూరి ముద్దలా తయారు చేయాలి. ఒక పాత్రలో 10 లీటర్ల ఆవు మూత్రం, ఆకుల ముద్దను వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మూతపెట్టి బాగా ఉడికించి పొయ్యి మీద నుంచి దించి.. 48 గంటల పాటు చల్లారనివ్వాలి. తర్వాత గుడ్డతో వడకడితే బ్రహ్మాస్త్రం సిద్ధమైనట్లే. ఎకరాకు 100 లీటర్ల నుంచి 2 లేదా రెండున్నర లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారీ చేయాలి. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.