News January 3, 2025
మహిళలకు ఫ్రీ బస్.. బెంగళూరులో ఏపీ మంత్రులు
AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సర్కార్ వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన మంత్రివర్గ సబ్ కమిటీ కర్ణాటకలోని బెంగళూరులో పర్యటిస్తోంది. మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణి అక్కడి బస్సులు ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డితో వారు భేటీ అయ్యారు. అక్కడ అమలవుతున్న ఫ్రీ బస్ జర్నీపై వారు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News January 17, 2025
కోటి దాటిన టీడీపీ సభ్యత్వాలు.. లోకేశ్ ట్వీట్
AP: TDP సభ్యత్వాలు కోటి దాటినందుకు మంత్రి లోకేశ్ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘రికార్డులు సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యం. పీక మీద కత్తి పెట్టి వేరే పార్టీ అధినేతకు జై కొడితే విడిచిపెడతామని చెప్పినా జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య నాకు ప్రతి క్షణం గుర్తొస్తారు. కార్యకర్తల అభిప్రాయాలను గౌరవించే ఒకే ఒక్క పార్టీ టీడీపీ’ అని ట్వీట్ చేశారు.
News January 17, 2025
సైఫ్ అలీఖాన్ గురించి తెలుసా?
సైఫ్ 1970లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, షర్మిలా ఠాగూర్ దంపతులకు జన్మించారు. పటౌడీ భారత క్రికెట్ జట్టుకు సారథిగా వ్యవహరించారు. సైఫ్ 1991లో నటి అమృత సింగ్ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారే సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్. సారా పలు సినిమాల్లో హీరోయిన్గా నటించారు. 2012లో సైఫ్ కరీనా కపూర్ను పెళ్లాడారు. వీరికి తైమూర్, జహంగీర్ జన్మించారు. సైఫ్ ఆస్తి సుమారు రూ.1,200 కోట్లు ఉంటుంది.
News January 17, 2025
లోకల్ ఛానల్స్లో పైరసీ మూవీలు.. దిల్ రాజు వార్నింగ్
ప్రైవేటు వెహికల్స్, లోకల్ ఛానల్స్లో అనుమతి లేకుండా కొత్త సినిమాలను ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్మాత, తెలంగాణ FDC ఛైర్మన్ దిల్ రాజు హెచ్చరించారు. ఇటీవల కొత్త సినిమాలను పర్మిషన్ లేకుండా ప్రదర్శిస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇలా అక్రమంగా ప్రదర్శించడం వల్ల సినిమాలపై ఆధారపడి జీవిస్తున్న వారికి నష్టం వాటిల్లుతుందన్నారు.