News August 1, 2024
హెల్త్ పెన్షన్లు అందుకునే వారికి ఉచిత బస్సు ప్రయాణం!

AP: తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్లు అందుకునే వారికి ఉచిత బస్సు పాస్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల గుండె, లివర్, కిడ్నీ జబ్బులు, తలసేమియా, పక్షపాతం, లెప్రసీ, హీమోఫిలియా సమస్యలున్న 51 వేల మందికి మేలు జరగనుంది. చికిత్స కోసం పట్టణాల్లోని ఆస్పత్రులకు వచ్చి వెళ్లేందుకు రోగులు రూ.200 నుంచి రూ.600 భరించాల్సి వస్తోంది. ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఈ ఖర్చు నుంచి ఉపశమనం లభించనుంది.
Similar News
News January 31, 2026
బోండా గొంతులో ఇరుక్కుని మృతి

TG: హైదరాబాద్లో ఓ వ్యక్తి టిఫిన్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. మధురానగర్ పీఎస్ పరిధిలోని రహ్మత్ నగర్లో గురువారం అర్ధరాత్రి లారీ డ్రైవర్ దాసరి రమేశ్ (45) ఓ టిఫిన్ సెంటర్ వద్ద బోండాలు కొన్నాడు. అక్కడే కూర్చొని తింటుండగా ఓ బోండా గొంతులో ఇరుక్కుంది. ఊపిరాడక తీవ్రంగా ఇబ్బందిపడ్డ ఆయన కాసేపటికే ప్రాణాలు వదిలాడు.
News January 31, 2026
ఐరన్ టాబ్లెట్లు ఎప్పుడు తీసుకోవాలంటే

ఐరన్ లోపించినప్పుడు, శరీరం తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేదు. దీనివల్ల కణజాలాలకు, అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందదు. దీనికోసం ఐరన్ కోసం ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. వీటిని పరగడపున తీసుకుంటే చక్కగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ఐరన్తో పాటు వేరే మందులు తీసుకోవద్దు. ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న గంట వరకూ డెయిరీ ప్రోడక్ట్స్ అయిన పాలు, పెరుగు వంటివి తీసుకోకూడదని చెబుతున్నారు.
News January 31, 2026
నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో ఉద్యోగాలు

<


