News April 6, 2024

20 వేల మంది పిల్లలకు ఫ్రీ ఎంట్రీ

image

ముంబై ఇండియన్స్ రేపు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ను ముంబై ESA డేగా సెలబ్రేట్ చేసుకోనుంది. అందులో భాగంగా ముంబై నగరంలోని NGOల నుంచి 20 వేల మంది పిల్లలకు ఫ్రీగా మ్యాచ్‌ను చూసే అవకాశం కల్పించనున్నారు. కాగా 2010 నుంచి ప్రతి సీజన్‌లో ముంబైలో జరిగే ఓ మ్యాచ్‌ను ESA (అందరికీ విద్య, క్రీడలు) డేగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

Similar News

News July 8, 2025

బిహార్ సీఎం నితీశ్ సంచలన ప్రకటన

image

ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

News July 8, 2025

ఫిష్ వెంకట్‌కు హీరో విశ్వక్ సేన్ సాయం

image

కిడ్నీ సమస్యలతో తెలుగు నటుడు <<16976046>>ఫిష్ వెంకట్<<>> ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందనే సమాచారం తెలుసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మంచి మనసు చాటుకున్నారు. వైద్య అవసరాల కోసం రూ.2లక్షల చెక్కును వెంకట్ కుటుంబానికి అందించారు. అటు సినీ పెద్దలు కూడా ముందుకొచ్చి స్పందించాలని వెంకట్ కుటుంబం వేడుకుంటోంది.

News July 8, 2025

ఛార్జీల తగ్గింపును వినియోగించుకోవాలి: RTC

image

AP: విశాఖ నుంచి BHEL, MGBS, విజయవాడ, అమలాపురం వెళ్లే బస్సు ఛార్జీలు తగ్గగా, ఇటీవల అమల్లోకి వచ్చాయి. అమరావతి, నైట్ రైడర్ సీట్, బెర్త్, ఇంద్ర బస్సుల్లో 10% ఛార్జీలు తగ్గగా, ప్రయాణికులు వినియోగించుకోవాలని RTC యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. బస్సుల ఆక్యుపెన్సీ పెంచేలా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అమరావతి బస్సుకు విశాఖ-BHEL ఛార్జీ రూ.1870 నుంచి రూ.1690కి, విజయవాడ ఛార్జీ రూ.1070 నుంచి రూ.970కి తగ్గింది.