News March 25, 2024
ఈ నెల 30 నుంచి జనంలోకి జనసేనాని

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 30న పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని.. అక్కడ ఉంటూనే AP వ్యాప్తంగా ప్రచారానికి వెళ్తారని పార్టీ వెల్లడించింది. తొలిరోజు శక్తిపీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారిని, అనంతరం దత్తపీఠాన్ని దర్శించుకోనున్న ఆయన.. ఆ తర్వాత మూడు రోజులు పిఠాపురంలోనే ఉంటారు. ఉగాది వేడుకలను కూడా అక్కడే పవన్ నిర్వహించుకోబోతున్నారు.
Similar News
News April 7, 2026
ఇది MAVIGUNపై చర్చను దారి మళ్లించడమే: జగన్

మహిళలను ఉద్దేశించి ABN రాధాకృష్ణ చేసిన <<19591145>>వ్యాఖ్యలను<<>> ఖండిస్తున్నట్లు YCP చీఫ్ జగన్ అన్నారు. ‘ఇది మహిళలను అవమానించడమే కాదు, ప్రజల్లో MAVIGUNపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడమే. తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా మా నాయకులు, కార్యకర్తలు సంయమనంతో ఉన్నారు. RKపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వ్యాఖ్యలను సమర్థించిన నేతల వైఖరిని ఖండిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
News April 7, 2026
ఇది MAVIGUNపై చర్చను దారి మళ్లించడమే: జగన్

మహిళలను ఉద్దేశించి ABN రాధాకృష్ణ చేసిన <<19591145>>వ్యాఖ్యలను<<>> ఖండిస్తున్నట్లు YCP చీఫ్ జగన్ అన్నారు. ‘ఇది మహిళలను అవమానించడమే కాదు, ప్రజల్లో MAVIGUNపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడమే. తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా మా నాయకులు, కార్యకర్తలు సంయమనంతో ఉన్నారు. RKపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వ్యాఖ్యలను సమర్థించిన నేతల వైఖరిని ఖండిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
News April 7, 2026
ఉత్కంఠ.. ఈ అర్ధరాత్రి ఏం జరగనుంది?

‘ఈ రాత్రికి అందరూ చనిపోతారు’ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ప్రజలకు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఇది. దీంతో రాత్రికి ఏం జరగనుందని ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మరోవైపు పవర్ ప్లాంట్లపై అమెరికా దాడి చేస్తే రీజియన్ మొత్తం అంధకారం అవుతుందని ఇరాన్ అంటోంది. తాజా హెచ్చరికలు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నాయి. వార్ తీవ్రరూపం దాలిస్తే ‘ఎనర్జీ’ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుందని ఆందోళన చెందుతున్నాయి.


