News December 17, 2024

ఇక నుంచి అన్ని ఎమర్జెన్సీ సేవలకు ‘డయల్ 112’

image

TG: అత్యవసర సేవలన్నింటికీ ఇక నుంచి ఒకే నంబర్ వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డయల్ 100, 108, 101 స్థానంలో ‘డయల్ 112’ సేవలను రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే టీజీ పేరుతో అధికారులు లోగోను సిద్ధం చేశారు. ఎమర్జెన్సీ సేవల కోసం కేంద్రం గతంలోనే 112 నంబర్‌ను తెచ్చింది. రాష్ట్రంలో త్వరలోనే సీఎం రేవంత్ ఈ సేవలను ప్రారంభించనున్నారు.

Similar News

News January 21, 2025

నేటి నుంచి దరఖాస్తులకు మరో అవకాశం

image

TG: రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు నేటి నుంచి ప్రభుత్వం మరోసారి దరఖాస్తులను స్వీకరిస్తోంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా ఆయా గ్రామాలకు చేరింది. తమ పేర్లు రాలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారికి అవకాశమివ్వాలని సర్కారు నిర్ణయించింది. అలాంటివారి నుంచి గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది.

News January 21, 2025

మరో వారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు

image

TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మరో వారంపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గద్వాల జిల్లా మినహా అన్ని జిల్లాల్లో టెంపరేచర్ 15°C కంటే తక్కువగా నమోదవుతుండటంతో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News January 21, 2025

ఎంపీల కారు అలవెన్సుగా నెలకు రూ.లక్ష

image

AP: రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్య‌సభ సభ్యుల కార్లకు అలవెన్సుల కింద నెలకు రూ.లక్ష చొప్పున మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మంత్రులకు మినహా మిగతా ఎంపీలకు ఈ అలవెన్స్ వర్తించనుంది. అలాగే డిప్యూటీ స్పీకర్, ఆర్థిక మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్‌కు గృహోపకరణాల కొనుగోలుకు ఒకసారి గ్రాంటుగా రూ.1.50లక్షల చొప్పున రూ.4.50 లక్షలు మంజూరు చేస్తూ మరో ఉత్తర్వును సర్కారు జారీ చేసింది.