News September 24, 2024
తిరుమలలో రూ.22 కోట్లతో FSSAI ల్యాబ్

తిరుమలలో ₹22 కోట్లతో ల్యాబ్ ఏర్పాటుకు FSSAI సిద్ధమైంది. ఇందుకోసం 12000 చదరపు అడుగుల స్థలాన్ని TTD కేటాయించింది. లడ్డూ, అన్నదానం, ఇతర అవసరాల కోసం రూ.800 కోట్లకు పైగా విలువైన పదార్థాలను TTD ఏటా కొనుగోలు చేస్తోంది. వీటి నాణ్యత పరిశీలనకు FSSAI ల్యాబ్ ఏర్పాటు చేయాలని TTD ఇటీవల కోరింది. ఇందులో ₹5 కోట్లతో మైక్రోబయాలజీ వ్యవస్థ, ₹9 కోట్లతో అత్యాధునిక యంత్రాలు, ₹6 కోట్లతో బేసిక్ పరికరాలను కొనుగోలు చేస్తారు.
Similar News
News February 5, 2026
చైనా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన ట్రంప్

చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఫోన్లో మాట్లాడినట్లు US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘మిలిటరీ, ట్రేడ్, APRలో నా చైనా విజిట్పై చర్చించాం. చైనా ఈ సీజన్లో సోయాబీన్ దిగుమతులను 20M టన్నులకు, వచ్చే ఏడాది 25M టన్నులకు పెంచనుంది. విమాన ఇంజిన్లు, ఇతర వస్తువుల కొనుగోళ్లపై పాజిటివ్గా ఉంది. చైనా, జిన్పింగ్తో నా వ్యక్తిగత సంబంధాలు ఎంతో బాగున్నాయి. వచ్చే మూడేళ్లలో మంచి ఫలితాలు వస్తాయి’ అని పేర్కొన్నారు.
News February 5, 2026
జగన్.. అల్లర్ల రాజకీయాలకు స్వస్తి పలకండి: అచ్చెన్నాయుడు

AP: జగన్ గుంటూరు పర్యటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైరయ్యారు. ‘తాడేపల్లి నుంచి గుంటూరుకు ప్రయాణం 9 గంటల పాటు సాగదీయడం మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఇలా మీరు రోడ్లపైకి వచ్చి అల్లర్లు సృష్టించాలని చూడటం సరికాదు. ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి ఉంటే రోడ్లపై డ్రామాలు ఆపి ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి. దమ్ముంటే సభలో చర్చిద్దాం. ఇకనైనా అల్లర్ల రాజకీయాలకు స్వస్తి పలకాలి’ అని సూచించారు.
News February 5, 2026
T20 WC: భారత్ ఘన విజయం

T20 WC వార్మప్ మ్యాచ్లో SAపై భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 240 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ (20 బాల్స్లో 53), తిలక్ వర్మ (19 బంతుల్లో 45) దూకుడుగా ఆడగా, హార్దిక్ పాండ్య (10 బంతుల్లో 30) చివర్లో మెరుపులు మెరిపించారు. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.


