News September 24, 2024

తిరుమలలో రూ.22 కోట్లతో FSSAI ల్యాబ్

image

తిరుమలలో ₹22 కోట్లతో ల్యాబ్ ఏర్పాటుకు FSSAI సిద్ధమైంది. ఇందుకోసం 12000 చదరపు అడుగుల స్థలాన్ని TTD కేటాయించింది. లడ్డూ, అన్నదానం, ఇతర అవసరాల కోసం రూ.800 కోట్లకు పైగా విలువైన పదార్థాలను TTD ఏటా కొనుగోలు చేస్తోంది. వీటి నాణ్యత పరిశీలనకు FSSAI ల్యాబ్ ఏర్పాటు చేయాలని TTD ఇటీవల కోరింది. ఇందులో ₹5 కోట్లతో మైక్రోబయాలజీ వ్యవస్థ, ₹9 కోట్లతో అత్యాధునిక యంత్రాలు, ₹6 కోట్లతో బేసిక్ పరికరాలను కొనుగోలు చేస్తారు.

Similar News

News January 21, 2026

భయపడొద్దు పార్టీ అండగా ఉంటుంది: జగన్

image

AP: ప్రభుత్వ దన్నుతో కూటమి నేతలు, పోలీసులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వ్యవస్థల్ని దిగజారుస్తున్నారని YCP చీఫ్ వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇటీవల హత్యకు గురైన పల్నాడు జిల్లా పిన్నెల్లికి చెందిన సాల్మన్ కుమారులు, పార్టీనేతలు తాడేపల్లిలో జగన్‌ను కలిశారు. టీడీపీ నేతలు వేధిస్తున్నారని తెలిపారు. కాగా ఎవరూ భయపడొద్దని, అక్రమ కేసులపై పార్టీ లీగల్ సెల్ న్యాయసహాయం అందిస్తుందని జగన్ వారికి భరోసా ఇచ్చారు.

News January 21, 2026

హైదరాబాద్‌లోని NIRDPRలో 98 ఉద్యోగాలు

image

HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్& పంచాయతీ రాజ్( NIRDPR)98 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. PG అర్హతతో పాటు పని అనుభవం గలవారు JAN 29 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50. నెలకు Sr. కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్‌కు రూ.75K, కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్‌కు రూ.60K చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: career.nirdpr.in/

News January 21, 2026

మహిళలు కాళ్లకు పసుపు ఎందుకు రాసుకోవాలంటే..

image

హిందూ సంప్రదాయంలో పసుపుకు ప్రాధాన్యం ఎక్కువ. పసుపును ఆహారంలో వాడటంతో పాటు ప్రత్యేక పర్వదినాల్లో కాళ్లకు పసుపు రాసుకుంటారు. దీనివెనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. పసుపుకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు గాయాలను మాన్పిస్తుంది. మహిళలు నీటిలో పనిచేయడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు, కాళ్ల నొప్పులు, వాపులను పసుపు నిరోధిస్తుంది.