News March 3, 2025
ఉత్తరాంధ్ర టీచర్ MLCగా గాదె శ్రీనివాసులు విజయం

AP: ఉత్తరాంధ్ర టీచర్ MLCగా PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆయన గెలుపొందారు. శ్రీనివాసులు 10,068 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ దాటడంతో విజేతగా ప్రకటించారు. మరోవైపు, వెయ్యికి పైగా ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. విజేతను డిసైడ్ చేసే ప్రక్రియలో 8మందిని ఎలిమినేషన్ చేయాల్సి వచ్చింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ 11గంటల పాటు సాగింది.
Similar News
News November 28, 2025
మరోసారి మెగా పీటీఎం

AP: మరోసారి మెగా పేరెంట్-టీచర్స్ మీట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. DEC 5న జూనియర్ కాలేజీలతో పాటు 45వేల ప్రభుత్వ బడుల్లో ఈ ప్రోగ్రాం జరగనుంది. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను చూపించి తల్లిదండ్రులతో క్లాస్ టీచర్ మాట్లాడనున్నారు. మంత్రి లోకేశ్ మన్యం జిల్లాలో నిర్వహించే మెగా పీటీఎంలో పాల్గొంటారు. గతేడాది మొదటిసారి, ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో రెండోది, వచ్చే నెల మూడో మెగా పీటీఎం జరగనుంది.
News November 28, 2025
వైకుంఠ ద్వార దర్శనం: లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వకపోతే..?

వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు ఉంటుంది. అందులో మొదటి 3 రోజులు మాత్రమే లక్కీ డిప్ ద్వారా భక్తులను ఎంపిక చేస్తారు. లక్కీ డిప్లో సెలక్ట్ అవ్వని భక్తులకు నిరాశ అనవసరం. JAN 2 – JAN 8వ వరకు రోజుకు 15K చొప్పున విడుదలయ్యే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వీటిని బుక్ చేసుకున్న అందరికీ వైకుంఠ ద్వారం గుండా దర్శనం లభిస్తుంది. ఇవి DEC 5న విడుదలవుతాయి. ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి.
News November 28, 2025
త్వరలో BSNLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

త్వరలో <


