News August 3, 2024
గంభీర్ ప్రయోగం బెడిసికొట్టిందా?

శ్రీలంకతో తొలి వన్డేలో గెలవాల్సిన టీమ్ ఇండియా టైతో సరిపెట్టుకుంది. మ్యాచ్ టై కావడానికి హెడ్ కోచ్ గంభీర్ చేసిన ప్రయోగమే కారణమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నాలుగో స్థానంలో రెగ్యులర్గా ఆడే అయ్యర్కు బదులుగా సుందర్ను పంపారు. సుందర్ 5 పరుగులకే వెనుదిరిగి ఒత్తిడి పెంచారు. మరోవైపు స్పిన్నర్లపై దూకుడుగా ఆడే దూబేను కూడా ఎనిమిదో స్థానంలో పంపడం భారత్కు నష్టం చేకూర్చిందని విమర్శిస్తున్నారు.
Similar News
News September 18, 2025
ఈసీఐఎల్లో 160 ఉద్యోగాలు

హైదరాబాద్లోని <
News September 18, 2025
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

APలోని రాయలసీమలో ఒకటి, రెండుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరించింది. కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలోని HYDలో సాయంత్రం మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.
News September 18, 2025
‘OG’ టికెట్ ధరల పెంపు.. YCP శ్రేణుల ఫైర్

పవన్ కళ్యాణ్ OG సినిమా <<17742687>>టికెట్<<>> రేట్లను పెంచడంపై వైసీపీ శ్రేణులు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. బెనెఫిట్ షోకు ఏకంగా రూ.1,000 (జీఎస్టీ కలుపుకుని) ఏంటని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పుష్ప-2 సినిమా టికెట్ ధరలను సైతం (రూ.800+GST) పెంచిన విషయం గుర్తు లేదా అని పవన్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీ కామెంట్?