News March 9, 2025
భారత్ గెలుస్తుందా అంటూ గంభీర్ ప్రశ్న.. ఫ్యాన్స్ ఆగ్రహం

‘భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుందా? రోహిత్-కోహ్లీ జోడీ గెలిపిస్తారా?’. ఇవీ టీమ్ ఇండియా హెడ్ కోచ్ గంభీర్ ట్విటర్ ఖాతాలో ప్రత్యక్షమైన ప్రశ్నలు. ఓ బెట్టింగ్ పోర్టల్ను ప్రమోట్ చేస్తూ గంభీర్ ఆ ట్వీట్ చేశారు. ఆ ప్రమోషనే తప్పంటే.. హెడ్ కోచ్ అయి ఉండీ భారత్ గెలుస్తుందా అని అడగడమేంటంటూ భారత అభిమానులు ఫైరవుతున్నారు. మరోవైపు.. అది ముందే షెడ్యూల్ అయిన ట్వీట్ అంటూ ఆయన ఫ్యాన్స్ సపోర్ట్గా నిలుస్తున్నారు.
Similar News
News September 18, 2025
మృతుల కుటుంబాలకు ₹5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా

AP: నెల్లూరు (D) సంగం(M) పెరమన వద్ద నిన్న కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.35లక్షలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లగా చిన్నారితో సహా ఏడుగురు మరణించారు.
News September 18, 2025
HLL లైఫ్కేర్లో ఉద్యోగాలు

<
News September 18, 2025
త్వరలో US టారిఫ్స్ ఎత్తివేసే ఛాన్స్: CEA

భారతీయ వస్తువులపై US విధించిన 25% అడిషనల్ టారిఫ్స్ను నవంబర్ 30 తర్వాత ఎత్తివేసే ఛాన్సుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్(CEA) అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ‘IND, US మధ్య ట్రేడ్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పరస్పర సుంకాలకు పరిష్కారం లభించే ఛాన్సుంది. జియో పాలిటిక్స్ పరిస్థితులే US టారిఫ్స్కు కారణమని అనుకుంటున్నా’ అని కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.