News January 16, 2025

జూదాన్ని రాష్ట్రక్రీడగా మార్చేశారు: YSRCP

image

AP: కూటమి నేతలు సంప్రదాయం ముసుగులో జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చేశారని YCP ఆరోపించింది. ‘పండుగ రోజుల్లో దగ్గరుండి మరీ ప్రతి ఊరిలో జూదం, కోడి పందేలు నిర్వహించారు. ప్రతి బరి నుంచి భారీగా కమీషన్లు వసూలు చేస్తూ నాయకులు బాగుపడ్డారు. కానీ జూదంలో డబ్బులు పోయిన వాళ్లు ఒట్టి చేతులతో ఇళ్లకు వెళ్తున్నారు. ప్రజలు ఏమైపోతేనేం తాము బాగుపడితే చాలన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఉంది’ అని ట్వీట్ చేసింది.

Similar News

News February 16, 2025

మజ్లిస్ మా ప్రధాన శత్రువు: కిషన్ రెడ్డి

image

TG: మజ్లిస్ పార్టీ తమ ప్రధాన శత్రువని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘మజ్లిస్ పార్టీ చాప కింద నీరులా బలాన్ని పెంచుకుంటోంది. బీజేపీ శ్రేణులు జాగ్రత్త పడాలి. ఆ పార్టీ కోరల్ని పీకాలి. సీఎం రేవంత్ ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారారు. ఆయన మాటలు కోటలు దాటుతాయి తప్ప పనులు సచివాలయం కూడా దాటట్లేదు’ అని విమర్శించారు.

News February 16, 2025

చికెన్ మార్కెట్.. ఆదివారం ఆదుకునేనా?

image

చాలా ఇళ్లలో ఆదివారం వచ్చిందంటే ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే బర్డ్ ఫ్లూ భయాందోళనలతో గత కొన్ని రోజులుగా చికెన్, గుడ్డు తినడాన్ని చాలామంది తగ్గించేశారు. ప్రమాదం లేదని ప్రభుత్వమే చెబుతున్నా ప్రజలు భయపడుతున్నారు. రేట్లు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. మరి ఆదివారమైనా ప్రజలు తిరిగి చికెన్ వైపు చూస్తారా లేక ఇతర నాన్ వెజ్ ఆప్షన్లను ఎంచుకుంటారా? చూడాలి.

News February 16, 2025

ఫ్యాన్స్‌కోసం మెగాస్టార్ కీలక నిర్ణయం?

image

గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి సినిమాలేవీ విడుదల కాలేదు. ఈ ఏడాది విశ్వంభరను దించేందుకు సిద్ధమవుతున్న ఆయన, వచ్చే ఏడాది ముగిసేలోపు మరో రెండు సినిమాల్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విశ్వంభర షూటింగ్ దాదాపు పూర్తి కాగా.. తర్వాత అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలతో సినిమాల్ని వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది చివరిలోపు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సినీవర్గాలు చెబుతున్నాయి.

error: Content is protected !!