News March 18, 2025
బాలికపై సామూహిక అత్యాచారం.. 8 మంది అరెస్ట్

AP: కృష్ణా(D) వీరపనేనిగూడెంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో 8 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 9న రాత్రి స్నేహితురాలి ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలికను యువకులు కిడ్నాప్ చేశారు. 3 రోజులపాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించారు. నిందితుల్లో ఒకరు ఇటీవల టెన్త్ పరీక్ష రాసినట్లు గుర్తించారు.
Similar News
News July 7, 2025
కానిస్టేబుల్పై దాడి.. యోగి మార్క్ ట్రీట్మెంట్

UP: ఫిలిభిట్ జిల్లాలో హెడ్ కానిస్టేబుల్పై దాడి చేసిన కేసులో తండ్రి, ముగ్గురు కుమారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహావీర్ ఫిర్యాదు ప్రకారం.. ఢాకా ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి మహావీర్ పెట్రోలింగ్ చేస్తున్నారు. ఓ గుంపును చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. వాళ్లు దాడి చేసి, యూనిఫామ్ చింపేశారు. వారికి పోలీసులు వారి మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే పోలీసులే దౌర్జన్యం చేశారని ఆ కుటుంబం ఆరోపిస్తోంది.
News July 7, 2025
గిల్ సేనపై లెజెండ్స్ ప్రశంసల వర్షం

ఎడ్జ్బాస్టన్లో గిల్ సేన వీరోచితంగా పోరాడింది. డ్రా అవుతుందనుకున్న మ్యాచ్ని విజయంగా మలిచారు. టీమ్ ఆల్రౌండ్ ప్రదర్శనను క్రికెట్ అభిమానులే కాదు.. లెజెండ్స్ సైతం ప్రశంసిస్తున్నారు. యంగ్ టీమ్ ఇండియా అటాక్.. ఇంగ్లండ్ కంటే గొప్పగా ఉందని గంగూలీ, సెహ్వాగ్, యువరాజ్, కోహ్లీ కొనియాడారు. కెప్టెన్ గిల్, ఓపెనర్స్, బౌలర్స్ ఆకాశ్ దీప్, సిరాజ్ ఇలా అంతా కలిసి గొప్ప విజయాన్ని అందుకున్నారని పేర్కొన్నారు.
News July 7, 2025
రెబలోడి దెబ్బ మర్చిపోయారా?: ప్రభాస్ ఫ్యాన్స్

డిసెంబర్ 5న ప్రభాస్ ‘ది రాజాసాబ్’, రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ క్లాష్ కన్ఫామ్ అయిపోయింది. కొందరు బాలీవుడ్ అభిమానులు ప్రభాస్ మూవీ వాయిదా వేసుకోవాల్సిందేనంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అలాంటి వారికి ప్రభాస్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. “ప్రభాస్తో పోటీపడి షారుక్ఖానే నిలబడలేకపోయారు. సలార్తో పోటీగా రిలీజైన ‘డుంకీ’కి ఏమైందో అప్పుడే మర్చిపోయారా?”అంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.