News April 10, 2024

CBN ఎన్నికల ముందు గంగ.. తర్వాత చంద్రముఖి: సీఎం

image

AP: జాబు రావాలంటే.. బాబు రావాలంటూ భ్రమ కల్పిస్తున్నారని CM జగన్ మండిపడ్డారు. ‘చంద్రబాబు ఎన్నికల ముందు గంగ.. ఆ తర్వాత చంద్రముఖి. ఆయన హయాంలో అసలు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయా? మా ప్రభుత్వంలో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. జాబు రావాలంటే.. జగన్ కావాలి. జాబుల విషయంలో బాబుది బోగస్ రిపోర్ట్. ఎల్లో మీడియా, కూటమి పార్టీలు గాడిదను గుర్రంలా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి’ అని దుయ్యబట్టారు.

Similar News

News January 15, 2026

ఈ నెలాఖరు నుంచి కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభం

image

ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను ఈ నెలాఖరు నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధం అవుతుంది. అయితే కాగ్నిజెంట్ వివిధ క్యాంపస్‌లలో పని చేస్తున్న దాదాపు 900 మందిని విశాఖకు బదిలీ చేశారు. మధురవాడ ఐటీ హిల్స్ సమీపంలో సొంత క్యాంపస్ కోసం 22 ఎకరాలు కేటాయించగా సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మహతి బ్లాక్‌లో కార్యకలపాలు సాగిస్తోంది.

News January 15, 2026

తలసానిపై కేసు.. వివాదం ఏంటి?

image

TG: BRS సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై SR నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన సికింద్రాబాద్‌లో జరిగిన ఓ ప్రోగ్రాంలో ‘సికింద్రాబాద్‌ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తాం’ అని CM రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్ డివిజన్ల పునర్విభజన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత రవి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా FIR ఫైల్ చేశారు.

News January 15, 2026

‘ఈసారి బులెట్ మిస్ అవ్వదు’.. ట్రంప్‌కు హెచ్చరిక

image

ఇరాన్ ప్రభుత్వానికి చెందిన టీవీ ఛానెల్‌ (Islamic Republic State TV) ట్రంప్‌కు హెచ్చరికలు చేస్తూ సంచలన ప్రసారాలు చేసింది. 2024 ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం దృశ్యాలను టెలికాస్ట్ చేస్తూ, ‘ఈసారి బులెట్ మిస్ అవ్వదు’ అంటూ హెచ్చరించింది. తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రసారం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దీనిపై ఆ దేశ అధికారులు స్పందించలేదు.