News November 10, 2024
చెత్త తెచ్చిన ఆదాయం రూ.650 కోట్లు

అక్టోబర్ 2 నుంచి 31 వరకు కేంద్రం చేపట్టిన ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం 4.Oకు మంచి స్పందన లభించింది. దేశవ్యాప్తంగా 5.97 లక్షల ప్రభుత్వ కార్యాలయాల్లోని చెత్తను తొలగించడం ద్వారా రూ.650 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్తగా 190 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వచ్చిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2021-24 మధ్య చెత్త అమ్మకం ద్వారా రూ.2,364 కోట్ల ఆదాయం లభించింది.
Similar News
News November 17, 2025
బీఎస్సీ నర్సింగ్లో అడ్మిషన్లు

AP: రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి 4 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విజయవాడలోని NTR హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. APNCET-2025లో 20 పర్సంటైల్ కంటే ఎక్కువ, 85-17 కటాఫ్ స్కోర్ మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. చివరి తేదీ నవంబర్ 18. పూర్తి వివరాలకు <
News November 17, 2025
సినిమా అప్డేట్స్

* సన్నీ డియోల్ ‘జాట్-2’ చిత్రానికి రాజ్కుమార్ సంతోషి డైరెక్షన్ చేయనున్నట్లు సమాచారం. తొలి పార్ట్ను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని మరో ప్రాజెక్టులో బిజీగా ఉండటమే కారణం.
* సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో ‘హీరామండి’ సీక్వెల్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
* యూనిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా ఎంపికవడం గర్వంగా ఉంది. పిల్లలు సంతోషం, ఆరోగ్యంతో కూడిన జీవితాన్ని గడపడానికి కృషి చేస్తా: కీర్తి సురేశ్
News November 17, 2025
ఆధార్ లేకున్నా స్కూళ్లలో ప్రవేశాలు!

TG: ఆధార్, బర్త్ సర్టిఫికెట్ లేకున్నా పిల్లలు బడిలో చేరొచ్చని విద్యాశాఖ తెలిపింది. గుర్తింపు పత్రాలు లేవని స్కూళ్లలో ప్రవేశాలను నిరాకరించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్, ఇతర సర్టిఫికెట్లు లేవని వలస కార్మికుల పిల్లలను స్కూళ్లలో చేర్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పత్రాలేవీ లేకున్నా ప్రవేశాలు కల్పించాలని అన్ని స్కూళ్లకు ఆదేశాలిచ్చింది. TC జారీ విషయంలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.


