News July 13, 2024
ఫిబ్రవరిలో గేట్ పరీక్ష

దేశంలోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్ ప్రవేశాలకు నిర్వహించే గేట్-2025 పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నాయి. 1, 2, 15, 16 తేదీల్లో ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఐఐటీ రూర్కీ చేపట్టింది. మొత్తం 30 సబ్జెక్టుల్లో ఎగ్జామ్స్ జరగనుండగా ఆగస్టు నెలాఖరులో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. గేట్ స్కోరు ద్వారా ఎంటెక్లో చేరితే నెలకు రూ.12,400 చొప్పున స్కాలర్షిప్ అందుతుంది.
Similar News
News January 23, 2026
లిక్కర్ స్కామ్.. ముగిసిన మిథున్రెడ్డి విచారణ

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. 7 గంటలపాటు హైదరాబాద్ ఈడీ ఆఫీసులో అధికారులు ఆయనను విచారించారు. మిథున్రెడ్డి వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. అనంతరం ఆయన ఇంటికి వెళ్లిపోయారు. నిన్న విజయసాయిరెడ్డిని ఇదే కేసులో అధికారులు 7 గంటలపాటు విచారించిన సంగతి తెలిసిందే.
News January 23, 2026
వృద్ధాప్యానికి చెక్ పెట్టొచ్చు: ఎలాన్ మస్క్

మరణాన్ని, వృద్ధాప్యాన్ని అడ్డుకోవచ్చని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. వయసుని తగ్గించడం కూడా సాధ్యమేనని అన్నారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఆయన మాట్లాడారు. శరీరంలోని అన్ని భాగాలు ఒకేసారి ముసలితనం వైపు వెళ్తున్నాయంటే దానికి ఒక కారణం తప్పకుండా ఉంటుందన్నారు. అయితే మనిషి ఎక్కువ కాలం జీవిస్తే క్రియేటివిటీ తగ్గి సమాజంలో వచ్చే మార్పులు ఆగిపోవచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు.
News January 23, 2026
INDvsNZ 4వ T20.. టికెట్లు విడుదల

భారత్-న్యూజిలాండ్ మధ్య 28వ తేదీన జరగనున్న 4వ T20కి టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ విశాఖలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో బుధవారం రాత్రి 7గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు district యాప్లో అందుబాటులో ఉన్నాయి.


