News November 12, 2024

శాంసన్‌పై ప్రశ్నకు మనసులు గెలిచేలా గౌతీ జవాబు

image

సంజూ శాంసన్ వరుస సెంచరీల వెనక తన ఘనతేమీ లేదని టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. అదంతా అతడి ప్రతిభేనని ప్రశంసించారు. ‘సంజూ ఫామ్‌ కోసం నేను చేసిందేమీ లేదు. అతడు సమర్థుడు. మనం చేయాల్సిందల్లా అతడిని సరైన స్థానంలో క్రీజులోకి పంపించి ఎంకరేజ్ చేయడమే. సంజూ చాలా శ్రమిస్తారు. ఇది అంతం కాదు ఆరంభం. భారత్ కోసం అతడిలాగే ఆడాలని కోరుకుంటున్నా. ప్రెజర్లోనూ యువ ఆటగాళ్లు రాణించడం శుభసూచకం’ అని పేర్కొన్నారు.

Similar News

News April 7, 2026

ఉమ్మడి గుంటూరు జిల్లాలో అదనపు కోర్టులు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరులో ఒక ఫ్యామిలీ కోర్టు ఇప్పటికే కొనసాగుతుండగా, మరో జిల్లా స్థాయి ఫ్యామిలీ కోర్టు ఏర్పాటు కానుంది. సత్తెనపల్లి, మంగళగిరిలో ఒక్కొక్క సబ్ కోర్టు, వినుకొండలో అదనంగా మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకానుంది. కొత్తగా అమరావతిలో మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

News April 6, 2026

BREAKING: ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్ విడుదల

image

ఏపీ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. రాజ్యసభ నుంచి తన వద్దకు వచ్చిన రాజధాని బిల్లును ఆమోదిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి ఇది అమలులోకి వస్తుందని ప్రకటనలో పేర్కొంది. CRDA-2014 చట్టంలో పొందుపరిచిన అమరావతిని రాజధానిగా కేంద్రం నోటిఫై చేసింది.

News April 6, 2026

జూన్ నుంచి మరింత తక్కువ ధరకు ఇన్సూరెన్స్?

image

IRDAI డెవలప్ చేసిన బీమా సుగమ్ పోర్టల్‌లో జూన్ నుంచి జీరో కమీషన్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్లతో పనిలేకుండా ఇన్సూరెన్స్‌ సంస్థలు ఈ పోర్టల్‌కు కేవలం 5-7% ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఫలితంగా ప్రీమియమ్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. JUNలో వెహికల్ ఇన్సూరెన్స్ లాంచ్ కానుంది. ఇక AUGలో హెల్త్ ఇన్సూరెన్స్, SEPలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.