News February 22, 2025

రెండు కార్పొరేషన్లుగా మారనున్న GHMC?

image

TG: హైదరాబాద్ పరిధి మరింతగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో GHMCపై పడుతున్న భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్‌ అనే 2 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. 150 డివిజన్లను చెరిసగం విభజించిన అనంతరం శివారు మున్సిపాలిటీలు, గ్రామాల్ని కూడా విలీనం చేయొచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దీనిపై కసరత్తు మొదలైందని పేర్కొన్నాయి.

Similar News

News March 26, 2025

వాషింగ్టన్ సుందర్‌పై స్పందించిన గూగుల్ సీఈఓ

image

వాషింగ్టన్ సుందర్‌‌ను గుజరాత్ టైటాన్స్ తుది జట్టులోకి తీసుకోకపోవడంపై గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియా టీమ్‌లో ఉన్న సభ్యుడికి IPL తుది జట్టులో చోటు కల్పించరా అని ఒక అభిమాని Xలో పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన సుందర్ పిచాయ్ నాకూ అదే ఆశ్చర్యంగా ఉందని రిప్లై ఇచ్చారు. GT-PBKS మధ్య జరిగిన మ్యాచులో పంజాబ్ జట్టు 243పరుగుల లక్ష్యాన్నినిర్దేశించగా GT స్వల్ప తేడాతో ఓడిపోయింది.

News March 26, 2025

Stock Markets: మీడియా, హెల్త్‌కేర్ షేర్లు కుదేలు

image

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్, రెసిస్టెన్సీ స్థాయి వద్ద అమ్మకాల సెగతో స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మిడ్ సెషన్లో నిఫ్టీ 23,604 (-65), సెన్సెక్స్ 77,696 (-320) వద్ద చలిస్తున్నాయి. మీడియా, హెల్త్‌కేర్, ఫార్మా, బ్యాంకు, ఫైనాన్స్, చమురు, ఐటీ, రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఇండస్‌ఇండ్, ట్రెంట్, ఎం&ఎం, BEL, గ్రాసిమ్ టాప్ గెయినర్స్. TECH M, NTPC, యాక్సిస్, సిప్లా టాప్ లూజర్స్.

News March 26, 2025

ముస్లిం కుటుంబాల మధ్య హిందువులు సేఫ్‌గా ఉండగలరా?: CM యోగి

image

తమ రాష్ట్రంలో అన్ని మతాలవారూ సేఫ్‌గానే ఉన్నారని UP CM యోగి అన్నారు. ‘హిందువులు సురక్షితంగా ఉంటే ముస్లింలూ సురక్షితంగానే ఉంటారు. 100 హిందూ కుటుంబాల మధ్యలో ఓ ముస్లిం కుటుంబం అత్యంత సురక్షితంగా ఉండగలదు. 100 ముస్లిం కుటుంబాల మధ్య 50మంది హిందువులు సేఫ్‌గా ఉండగలరా? బంగ్లా, పాక్ దేశాలే నిదర్శనం. అఫ్గాన్‌లో హిందువులు ఏమయ్యారు? అక్కడ జరిగిన తప్పు మన వద్ద జరగకూడదు’ అని స్పష్టం చేశారు.

error: Content is protected !!