News April 5, 2024

ఘోరం: బైక్ ఫైనాన్స్ చెల్లించలేదని రాళ్లతో కొట్టారు

image

TG: ఖమ్మంలో ఫైనాన్స్ ఏజెంట్లు దారుణానికి తెగబడ్డారు. బైక్ ఫైనాన్స్ కట్టలేదని వినయ్ అనే యువకుడిని వెంబడించి రాళ్లతో కొట్టారు. అతను పరిగెత్తుతూ ప్రమాదవశాత్తు ఖానాపురం మినీ ట్యాంక్ బండ్‌లో పడి దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనకు కారణమైన మోహన్ సాయి ఫైనాన్స్‌కు చెందిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 18, 2025

వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ ప్రచారం అవాస్తవం: డిస్కంలు

image

APCPDCL పరిధిలో వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతోందని వస్తున్న వార్తలను డిస్కంలు ఖండించాయి. పొగ మంచు కారణంగా సౌర విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడటంతో రెండు రోజులుగా కరెంటు సరఫరా సమయాన్ని రీషెడ్యూల్ చేశామని తెలిపాయి. నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోందని స్పష్టం చేశాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.

News January 18, 2025

గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

TG: రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందొద్దని, గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కులగణన ఆధారంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కార్డు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక పాత రేషన్ కార్డులు తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపైనా ఉత్తమ్ స్పందించారు. అలాంటిదేమీ ఉండదని, పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేరుస్తామని చెప్పారు.

News January 18, 2025

అతనొక్కడే దోషి కాదు.. ట్రైనీ డాక్టర్ తల్లి

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌ని కోర్టు దోషిగా తేల్చడంపై బాధితురాలి తల్లి హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ దారుణం వెనుక మరికొందరు ఉన్నారని ఆమె ఆరోపించారు. వారికి కూడా శిక్ష పడ్డప్పుడే న్యాయం జరిగినట్లు భావిస్తామన్నారు. అప్పటివరకు తాము ప్రశాంతంగా నిద్రపోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ కేసులో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు.